E-Paper
Advertisement

HC on BRS: పార్టీ కార్యాలయాలకు భూ కేటాయింపులు.. న్యాయస్థానంలో విచారణ

HC on BRS: పార్టీ కార్యాలయాలకు భూ కేటాయింపులు.. న్యాయస్థానంలో విచారణ

HC on BRS: బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు భూ కేటాయింపులపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. పార్టీ కార్యాలయాలకు చౌకగా భూములు ఇచ్చారంటూ దాఖలైన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది.

హైదరాబాద్‌తోపాటు మిగతా జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల కోసం చౌకగా భూములు అమ్మకాలు దక్కించుకున్నారని పిటిషనర్ ప్రస్తావించారు. 500 కోట్లు విలువైన భూమిని కేవలం 5 కోట్లుకు కేటాయించారని వాదించారు.

గజం 100 రూపాయలకే కేటాయింపు జరిగినట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అధికారులు, జర్నలిస్టులకు భూ కేటాయింపులపై గత నెల 25న ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పుని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

రెండేళ్లగా ఈ అంశంపై ప్రతివాది మాజీ సీఎం కేసీఆర్ కౌంటర్ దాఖలు చేయలేదని పేర్కొన్నారు. దీనిపై మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని మాజీ సీఎం కేసీఆర్‌తోపాటు ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×