E-Paper
Advertisement

లోకేశ్, పవన్‌లపై గుడివాడ అమర్నాథ్ ఫైర్.. ‘కుక్కను కనకపు సింహాసనంపై కూర్చోబెడితే’..

లోకేశ్, పవన్‌లపై గుడివాడ అమర్నాథ్ ఫైర్.. ‘కుక్కను కనకపు సింహాసనంపై కూర్చోబెడితే’..
Advertisement

Gudivada Amarnath: విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ పై వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. చనిపోయింది 8 మందే కదా అన్నట్లు మంత్రి లోకేశ్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పరామర్శ అనంతరం లోకేష్, పవన్ కళ్యాణ్ మాటలు చూసి ఉత్తరాంధ్ర ప్రజలు ముక్కున వేలు వేసుకున్నారన్ని విమర్శించారు. మరోవైపు కార్మిక సంఘం నేతలతో లోకేశ్ కోపంగా మాట్లాడటాన్ని.. అమర్నాథ్ తప్పుబట్టారు. పాలన చేయడం చేతకానప్పుడే ఇలాంటి ఫ్రస్టేషన్ వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

లోకేశ్ ఒక ఈవీఎం బ్యాచ్ అని, ఆయనది ఈవీఎం టీమ్ అంటూ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. లోకేశ్ ఆయన తండ్రి చంద్రబాబు.. ఎన్నికల్లో ఏ విధంగా గెలిచారో ప్రజలు చర్చించుకుంటున్నారని అన్నారు. కుక్కను కనకపు సింహాసనం మీద కూర్చోబెడితే ఎలా ఉంటుందో లోకేష్ పరిస్థితి చూస్తే అలానే ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలకు డబ్బు లేకపోవచ్చు గానీ ఆత్మగౌరవం ఉందంటూ అమర్నాథ్ పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ మరణాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని ఆయన ఆరోపించారు.

Advertisement

స్లీట్ ప్లాంట్ లో 6 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారని అమర్నాథ్ ఆరోపించారు. వీఆర్ఎస్ పేరుతో మరో 2000 మంది ఉద్యోగాలను కోల్పోయారని పేర్కొన్నారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని వైసీపీ నేత విమర్శించారు. నిన్నటి ప్రమాదానికి జగన్ కు ఏంటి సంబంధమని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దు అంటూ ఏనాడైన ప్రధాని మోదీని కోరారా? అంటూ పవన్ ను ప్రశ్నించారు. కానీ వైఎస్ జగన్ మాత్రం తన హయాంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖ రాశారని గుర్తుచేశారు. అసెంబ్లీలోనూ తీర్మానం చేశారని స్పష్టం చేశారు.

Also Read: బీజేపీ ‘స్వచ్ఛ పాఠశాల’.. బండి సంజయ్ వినూత్న కార్యక్రమం.. గిన్నీస్ రికార్డుపై కన్ను!

Advertisement

అంతేకాకుండా ప్రధాని మోదీ విశాఖ వచ్చిన సందర్భంలో బహిరంగ సభలోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దని జగన్ కోరారని అమర్నాథ్ అన్నారు. కేంద్ర మంత్రి కుమార స్వామి స్వయంగా జగన్ వలనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని చెప్పారని గుర్తుచేశారు. మరోవైపు స్టీల్ ప్లాంట్ బాధితులకు రూ. కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు. ప్రతీ బాధిత కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించాలని కోరారు. అలాగే బాధిత కుటుంబాల పునరావాసానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు.

Also Read: నాటి బతుకమ్మ చీరలతో.. అడవి పందులు తోలేవారు.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ సెటైర్లు

Related News

బోరున ఏడ్చిన బొత్స సత్యనారాయణ.. ఈ సారి ఎందుకంటే?

ప్రజాస్వామ్యం ఖూనీ.. స్కామ్‌ల వల్ల ‘కాక్రోచ్లు’ పుట్టుకొస్తారు-మాజీ సీఎం జగన్

మంటల్లో ట్రావెల్ బస్సు.. స్పాట్‌లో 19 మంది, తిరుపతి జిల్లాలో ఘటన

బీసీల విషయంలో టీడీపీ భారీ స్కెచ్.. 80 కులాలపై పల్లా కీలక ప్రకటన!

చంద్రబాబును అరెస్ట్ చేసి మూడేళ్లు.. లోకేశ్ ఏమన్నారంటే?

జోగి రమేష్ ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్.. గవర్నర్‌ను కలిసిన కోడలు మేఘన

చంద్రబాబు అరెస్ట్‌కు మూడేళ్లు.. తాడేపల్లిలో టీడీపీ వినూత్న కార్యక్రమం

జగన్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్ .. ఎప్పుడో తెలుసా ?

Big Stories

Advertisement
×