E-Paper
Advertisement

Harsha Veena Selfie Video: ఏ శిక్షకైనా సిద్ధం.. నా వాదన వినండి.. పవన్ కళ్యాణ్‌కు బాధితురాలి బహిరంగ సవాల్

Harsha Veena Selfie Video: ఏ శిక్షకైనా సిద్ధం.. నా వాదన వినండి..  పవన్ కళ్యాణ్‌కు బాధితురాలి బహిరంగ సవాల్
Advertisement

Harsha Veena Selfie Video: రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో బాధితురాలి హర్షవీణ.. తాజాగా మరో సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ఈ వివాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిసి తన గోడు వెళ్లబోసుకోవాలని ఆమె బలంగా ఆకాంక్షిస్తున్నారు. ఈ వీడియో డిప్యూటీ సీఎం దృష్టికి వెళ్లేలా చూడాలని ఆమె ప్రజలను, సోషల్ మీడియా వేదికలను కోరారు.

హర్షవీణ తన వీడియోలో స్థానిక జనసేన నాయకుడు తాతంశెట్టి నాగేంద్రపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శ్రీధర్‌కు, తనకు మధ్య ఉన్న వ్యక్తిగత విషయాన్ని నాగేంద్ర అనవసరంగా రాజకీయం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. శ్రీధర్ వైపు న్యాయం లేదు కాబట్టే.. నాగేంద్ర అసంబంధిత విషయాలను తెరపైకి తెస్తూ తనను ఇబ్బంది పెడుతున్నారని ఆమె మండిపడ్డారు. ఈ విషయంలో శ్రీధర్ తరపున ఆయన తల్లిదండ్రులు మాట్లాడాలని ఆమె డిమాండ్ చేశారు.

Advertisement

అరవ శ్రీధర్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా.. ప్రభుత్వ విప్‌గా ఉన్నందునే చట్టం నుండి తప్పించుకుంటున్నారని.. ఒకవేళ ఆయన సాధారణ వ్యక్తి అయి ఉంటే ఇప్పటికే రిమాండ్‌లో ఉండేవారని హర్షవీణ వ్యాఖ్యానించారు. అధికార బలంతో తనపై అన్యాయం జరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను కూడా పవన్ కళ్యాణ్ పర్యవేక్షిస్తున్న శాఖలోనే ఉద్యోగిని అని గుర్తు చేస్తూ.. తన శాఖా మంత్రిగా ఆయన తనకు న్యాయం చేస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

ఈ వివాదానికి సంబంధించి పూర్తి వివరాలను పవన్ కళ్యాణ్‌కు స్వయంగా వివరించాలని ఆమె కోరుతున్నారు. ఒకవేళ విచారణలో తనది తప్పని తేలితే.. ప్రభుత్వం విధించే ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధమని హర్షవీణ సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి.. తనకు అపాయింట్‌మెంట్ ఇచ్చి బాధితురాలిగా తన వాదనను వినాలని ఆమె వేడుకున్నారు.

Advertisement

Also Read: సైబర్ నేరగాళ్లపై హైదరాబాద్ పోలీసుల ఉక్కుపాదం.. జనవరిలో 37 మంది అరెస్ట్, రూ. 65కోట్ల లావాదేవీల గుర్తింపు

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×