BigTV English
Advertisement

TDP vs YCP: మండలాఫీసులో ప్రజాప్రతినిధుల భేటీ.. అడ్డుకున్న కూటమి కార్యకర్తలు, ఆపై ఉద్రిక్తత

TDP vs YCP: మండలాఫీసులో ప్రజాప్రతినిధుల భేటీ.. అడ్డుకున్న కూటమి కార్యకర్తలు, ఆపై ఉద్రిక్తత

TDP vs YCP: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరునెలలు గడిచిపోయింది. అయినా దిగువ స్థాయిలో కార్యకర్తల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. లేటెస్ట్‌గా ఉమ్మడి చిత్తూరు జిల్లా ములకల చెరువు ప్రాంతంలో గురువారం మండల సమావేశానికి ముందు కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది.


మండల కార్యాలయంలో భేటీ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. అదే సమయంలో సమావేశం నిర్వహించకూడదంటూ కూటమి నేతలు నిరసన తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మండల సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకుంటామన్నారు తెలుగు తమ్ముళ్లు. దీంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్దానికి దారితీసింది.

చివరకు ఘర్షణకు దారి తీసింది. ఇరు పార్టీల నేతలు మండల కార్యాలయానికి రాగానే పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మోహరించి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. డ్రోన్ కెమెరాలతో అల్లర్లుకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో పడ్డారు.


పోలీసులు దగ్గరుండి మండల ప్రజాప్రతినిధులను లోపలకు పంపారు. గత ఐదు సంవత్సరాలుగా ఏనాడు సమావేశంలో జరపలేదని, ఇప్పుడు వైసీపీ నేతలు సర్వసభ్య సమావేశం పెట్టడంపై మండిపడ్డారు టీడీపీ నేతలు. పోలీసులు జోక్యంతో ప్రస్తుతం ప్రశాంత పరిస్థితులు ఏర్పడినట్టు కనిపిస్తున్నాయి.

ALSO READ:  జేసీ దివాకర్ రెడ్డి బస్సులు కాలిపోయినయ్.. కావాలనే చేశారా..?

మరోవైపు ములకల చెరువు మండలం సర్వసభ్య సమావేశంలో ఎంపీడీవో‌తో వాగ్వాదానికి దిగారు వైకాపా ఎంపీటీసీలు ,జడ్పిటీసీలు. సమావేశం మినిట్స్ బుక్కున లాక్కున్నారు వైకాపా ఎంపీటీసీలు. సమావేశం నిర్వహించు కుండా ఇన్నాళ్లు ఏం చేశారంటూ ఎంపీడీవోను అసభ్య పదజాలంతో దూషించారట. అధికారులు సంతకాలు పెట్టడంపై అభ్యంతరం తెలిపారు. చివరకు ఎంపీడీవో చాంబర్లు ఎంపీడీవోని చుట్టుముట్టారు వైకాపా ఎంపీటీసీలు.

Related News

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Jagan Youth Politics: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్

CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబును కలవనున్న శ్రీచరణి

Big Stories

×