E-Paper
Advertisement

Plane Spotted Tirumala: శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు.. తెరమీదికి మళ్లీ ఆ అంశం!

Plane Spotted Tirumala: శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు.. తెరమీదికి మళ్లీ ఆ అంశం!
Advertisement

Plane Spotted Tirumala: తిరుమల శ్రీవారి ఆలయం పై ఆగమన శాస్త్ర సాంప్రదాయం ప్రకారం విమానాల రాకపోకలు నిషిద్ధం. అయితే అప్పుడప్పుడు శ్రీవారి ఆలయం పై విమానాలు చక్కర్లు కొడుతున్న ఘటనలు జరుగుతున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర విమానయాన శాఖను టీటీడీ పలుమార్లు విన్నవించింది. తిరుమల శ్రీవారి ఆలయాన్ని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని టీటీడీ అభిప్రాయపడుతోంది. తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లకుండా టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, అప్పుడప్పుడు శ్రీవారి ఆలయం పై విమానాలు చక్కర్లు కొట్టడంతో వివాదానికి దారితీస్తోంది.

తాజాగా గురువారం శ్రీవారి ఆలయం పై విమానం చక్కర్లు కొట్టినట్లు భక్తులు గుర్తించారు. ఉదయం 10 గంటల సమయంలో ఆలయం పై ఓ విమానం వెళ్ళినట్లుగా భక్తులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని టీటీడీ దృష్టికి పలువురు భక్తులు తీసుకెళ్లినట్లు సమాచారం. ఇంతకు శ్రీవారి ఆలయం పై విమానం చక్కర్లు కొట్టిందా లేదా అన్న విషయంపై టీటీడీ ఆరా తీస్తోంది.

Advertisement

Also Read: Horoscope scorpio 2025 :  వృశ్చిక రాశి జాతకులకు 2025లో ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం

ఎన్నో ఏళ్లుగా తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలన్న డిమాండ్ భక్తుల నోట వినిపిస్తోంది. పురాణాల ప్రకారం తిరుమల చిత్రం శ్రీ వెంకటేశ్వరుని దివ్య నివాసం. అందుకే నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని గతంలో కూడా చర్చ సాగిన సమయంలో, అప్పటి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు సెంట్రల్ ఏవియేషన్ నిబంధనల ప్రకారం తిరుమలను నో ఫ్లై జోన్ గా గుర్తించలేమని స్పష్టం చేశారు. అయితే భక్తుల మనోభావాలను గౌరవిస్తూ తిరుమల స్వామి ఆలయం మీదుగా విమానాలు నేరుగా వెళ్లకుండా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ప్రస్తుతం మరో మారు తిరుమల శ్రీవారి ఆలయం పై విమానం చక్కర్లు కొట్టడంతో, ఈ విషయం తెర మీదికి వచ్చింది.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×