E-Paper
Advertisement

High Tension in Gudivada: మాజీమంత్రి పేర్నినాని కారుపై దాడి.. పరిస్థితి ఉద్రిక్తం

High Tension in Gudivada: మాజీమంత్రి పేర్నినాని కారుపై దాడి.. పరిస్థితి ఉద్రిక్తం
Advertisement

High Tension in Gudivada: ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీమంత్రి పేర్నేనాని కారుపై జనసేన పార్టీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం వైసీపీ నేత తోట శివాజీ ఇంటికి వచ్చిన క్రమంలో పేర్ని నాని కారుపై దాడి చేశారు. అక్కడికి జనసేన పార్టీ కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకుని పేర్నినానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పేర్ని నాని వెంటనే పవన్ కల్యాణ్ కు క్షణాపలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. రాళ్లతో దాడి చేయడంతో పేర్ని నాని కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో గుడివాడలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు.

Also Read: భారీ వర్షాలు.. మరో వయనాడ్ గా విజయవాడ

Advertisement

ఈ ఘటనపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పందించారు. గుడివాడలో పేర్నినాని కారుపై దాడి ఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు సన్నగిల్లుతున్నాయన్నారు. తమ పార్టీ నాయకులకు ఏమైనా జరిగితే పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో అటవిక పాలనకు ఈ ఘటనలే నిదర్శనమని బొత్స మండిపడ్డారు.

ఏపీలో ప్రస్తుతం అటవిక పాలన, రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతుందన్నారు. గుడివాడలో పేర్ని నాని లక్ష్యంగా రెండుసార్లు దాడులు జరిగాయని బొత్స అన్నారు. స్నేహితుడి ఆహ్వానం మేరకు టీ తాగేందుకు వెళ్లిని పేర్ని నాని కారుపై జనసేన కార్యకర్తలు దాడి చేశారన్నారు. కారు అద్దాలను పూర్తిగా ధ్వంసం చేశారన్నారు. ఈ విధంగా దాడులకు పాల్పడడం సరికాదన్నారు బొత్స.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×