E-Paper
Advertisement

Municipal Chairperson Election: హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీ కైవసం, ఛైర్మన్‌గా రమేష్ ఎన్నిక

Municipal Chairperson Election: హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీ కైవసం, ఛైర్మన్‌గా రమేష్ ఎన్నిక
Advertisement

Municipal Chairperson Election: హిందూపురం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. అటు నెల్లూరు, ఏలూరులో కూడా టీడీపీ మద్దతుదారులుగా నిలిచారు. హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీ కైవసం అయ్యింది. మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి రమేశ్ ఎన్నికయ్యారు. అయితే రమేశ్‌కు అనుకూలంగా 23 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్ధి లక్ష్మికి అనుకూలంగా 14 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఓటింగ్‌లో ఎమ్మెల్యే బాలకృష్ణ ఎంపీ పార్ధసారథి పాల్గొన్నారు.

దీంతో మున్సిపల్ చైర్మన్‌గా రమేశ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రమేశ్‌తో మున్సిపల్ కమిషనర్ ప్రమాణ స్వీకారం చేయించారు. రమేష్‌ను దగ్గరుండి సీట్‌లో కూర్చోబెట్టారు ఎమ్మెల్యే బాలకృష్ణ. అయితే కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ కౌన్సిలర్లు బహిష్కరించారు. పార్టీ మారిన కౌన్సిలర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇటు జై బాలయ్య అంటూ టీడీపీ కౌన్సిలర్లు నినాదాలు చేశారు.

Advertisement

ఈ తరుణంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందూపురం మున్సిపల్ చైర్మన్‌గా ఆరో వార్డు కౌన్సిలర్ రమేష్ ఎన్నికైన సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు. గత వైసీపీ పరిపాలనతో విసిగిపోయిన ఆ పార్టీ కౌన్సిలర్‌లు టీడీపీలోకి వచ్చారని పేర్కొన్నారు. టీడీపీకి మద్దతు ఇచ్చారని తెలిపారు. మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన రమేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

నెల్లూరులో రిజల్ట్.. 

Advertisement

నెల్లూరు కార్పొరేషన్‌లో డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉత్కంఠకు తెరపడింది. ఫైనల్‌గా నెల్లూరు డిప్యూటీ మేయర్‌గా తహసీన్ ఎన్నిక అయ్యారు. టీడీపీ నుంచి 48వ డివిజన్ కార్పొరేటర్ తహసీన్‌కు అనుకూలంగా 41 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్థి కరిముల్లాకు 21 ఓట్లు వచ్చాయి. టీడీపీ, వైసీసీ నేతలు మైనార్టీలను నిలబెట్టడంతో ఎన్నిక ఆసక్తికరంగా మారింది. దీంతో ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఫలితం వచ్చేంది. 41ఓట్లతో నెల్లూరు డిప్యూటీ మేయర్‌గా తహసీన్ ఎన్నికయ్యారు.

ఏలూరులోనూ టీడీపీదే హవా..

ఏలూరు డిప్యూటీ మేయర్ పదవులు కూడా టీడీపీ కైవసం అయ్యాయి. డిప్యూటీ మేయర్లుగా దుర్గాభవానీ, ఉమామహేశ్వరరావు ఎన్నికయ్యారు. అయితే ఇక్కడ రెండు నామినేషన్లు మాత్రమే రావడంతో…
డిప్యూటీ మేయర్లుగా ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారులు డిక్లేర్ చేశారు.

ఇటు నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. మొత్తం 18 మంది మద్దతుతో టీడీపీ అభ్యర్ధి విజయం సాధించింది. మరోవైపు వైసీపీ అభ్యర్థి కేవలం 14 మంది మాత్రమే ఓటు వేశారు. దీంతో వైసీపీకి ఓటమి తప్పలేదు.

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Big Stories

Advertisement
×