E-Paper
Advertisement

Simhachalam facts: ఆ గోడ బలవంతంగా కట్టించారు..!

Simhachalam facts: ఆ గోడ బలవంతంగా కట్టించారు..!
Advertisement

సింహాచలం పుణ్యక్షేత్రంలో చందనోత్సవం సందర్భంగా జరిగిన దుర్ఘటనకు మూల కారణం ఎవరు అనే కోణంలో విచారణ జరుగుతోంది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దీన్ని ప్రకృతి వైపరీత్యంగా తేల్చేశారు కానీ, అందులో మానవ తప్పిదమే ఎక్కువగా ఉన్నట్టు అర్థమవుతోంది. హడావిడిగా గోడ కట్టడం, అందులోనూ నాణ్యత అస్సలు పాటించకపోవడం, కనీసం పిల్లర్లు, కాంక్రీట్ లేకుండా కేవలం ఫ్లైయాష్ బ్రిక్స్ తో గోడ కట్టడం వల్లే ప్రమాదం జరిగిందనే అనుమానాలున్నాయి. దీనిపై ప్రభుత్వం విచరాణ కమిటీ వేయడంతో ఇప్పుడిప్పుడే నిజాలు బయటపడుతున్నాయి.

Advertisement

కాంట్రాక్టర్ ఏమన్నారు..?
విచారణ కమిటీ అధికారుల ముందు ఆ గోడ కట్టిన కాంట్రాక్టర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అధికారులే బలవంతంగా తమతో గోడ కట్టించారని కమిటీ ముందు స్పష్టం చేశారు కాంట్రాక్టర్ లక్ష్మణరావు. అక్కడ గోడ కట్టలేమని తాను ముందుగానే చెప్పానని, కానీ అధికారులు బలవంతం చేశారని, తాను వద్దన్నా పని చేయాలని ఆదేశించారని, అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో గోడ కట్టామని అన్నారు.

ఏది నిజం..?
సింహాచలం చందనోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారనే విషయం తెలిసిందే. అయితే అక్కడ అంతకు ముందు నుంచే ప్రసాద్ పథకం ద్వారా పనులు జరుగుతున్నాయి. వాటి కొనసాగింపుగానే అక్కడ గోడ కట్టారు. అయితే ఆలయ వైదిక సిబ్బంది అక్కడ గోడ కట్టడం సరికాదని చెప్పారు. కానీ అధికారులు మాత్రం గోడ కట్టేందుకే నిర్ణయించారు. చందనోత్సవానికి కూడా టైమ్ దగ్గరపడటంతో హడావిడిగా గోడ కట్టినట్టు తెలుస్తోంది. చందనోత్సవం సమయానికి గోడ పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకోవడంతో అది నాసిరకంగా మారింది. అయితే ఇక్కడ తప్పు పూర్తిగా కాంట్రాక్టర్ దా, లేక అధికారులదా అనేది తేలాల్సి ఉంది.

Advertisement

కొండపైన ఉండే సింహాచలం లాంటి క్షేత్రాల్లో నిర్మాణాలు మరింత పటిష్టంగా ఉండాలి. ఒకవేళ వర్షం పడితే అక్కడ కొండవాలుగా వచ్చే వరదనీరు పటిష్ట నిర్మాణాలను సైతం పక్కకు నెట్టేస్తుంది. అందుకే కాంక్రీట్ నిర్మాణాలు మాత్రమే అక్కడ చేపట్టాలి. కానీ కూలిన గోడ విషయంలో అలాంటి ప్రమాణాలు పాటించలేదు. కేవలం రాయిపై రాయి పెట్టి కట్టుకుంటూ వెళ్లారు. మధ్యలో పిల్లర్లు వాడలేదు, ఎక్కడా కాంక్రీట్ కూడా ఉపయోగించలేదు. దీంతో ఒక్కసారిగా వర్షం కురవడం, వరదనీరు ఉధృతంగా ప్రవహించడంతో ఆ గోడకూలిపోయింది. భక్తులు దుర్మరణం పాలయ్యారు.

ప్రభుత్వం బాధ్యత ఎంత..?
సింహాచలం ఘటనలో తప్పంతా ప్రభుత్వానిదేనని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. అయితే ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ అసమర్థత దీనికి ప్రధాన కారణాలని తేలింది. అదే సమయంలో.. చందనోత్సవం వంటి పెద్ద కార్యక్రమాలు జరిగే సందర్భంలో ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందులోనూ ఇటీవలే తిరుమలలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల పంపిణీలో తొక్కిసలాట జరిగిన ఉదాహరణ కూడా ఉంది. మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఈ తరుణంలో మరో ప్రమాదం జరగడం బాధాకరం. ఇకనైనా ఇలాంటి దుర్ఘటనలకు అడ్డుకట్టపడాలి. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే కార్యక్రమాల విషయంలో ప్రభుత్వం, అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×