E-Paper
Advertisement

Donald Trump: టారిఫ్ లను వ్యతిరేకించేవాళ్లంతా ‘మూర్ఖులు’.. అమెరికన్లకు 2 వేల డాలర్ల డివిడెండ్: డొనాల్డ్ ట్రంప్

Donald Trump: టారిఫ్ లను వ్యతిరేకించేవాళ్లంతా ‘మూర్ఖులు’.. అమెరికన్లకు 2 వేల డాలర్ల డివిడెండ్: డొనాల్డ్ ట్రంప్
Advertisement

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల టారిఫ్ ల మోత మోగిస్తున్నారు. తనకు అనుకూలంగా లేని దేశాలపై భారీగా టారిఫ్ లు విధిస్తున్నారు. టారిఫ్ లతో యుద్ధాలు ఆపుతున్నాయని చెబుతున్న ట్రంప్.. తాజాగా మరోసారి తన టారిఫ్ లో విధానంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. టారిఫ్ విధించడంపై తన వైఖరిని సమర్థించుకున్నారు. ఈ విధానాన్ని వ్యతిరేకించేవారిని “మూర్ఖులు” అని ఘాటుగా స్పందించారు. సుంకాలు అమెరికాను మరింత బలంగా, సంపన్నంగా మార్చాయని పేర్కొన్నారు.

వాళ్లంతా మూర్ఖులు

“సుంకాలను వ్యతిరేకించే వాళ్లు మూర్ఖులు” అంటూ సోషల్ మీడియాలో ట్రంప్ రాసుకొచ్చారు. తన నాయకత్వంలో అమెరికా ప్రపంచంలోనే అత్యంత ధనిక, అత్యంత ప్రభావవంతమైన దేశంగా మారిందన్నారు. దాదాపు ద్రవ్యోల్బణం లేకుండా రికార్డు స్టాక్ మార్కెట్ ధరతో వృద్ధి సాధిస్తుందని చెప్పుకొచ్చారు. వివిధ దేశాలపై విధించిన సుంకాల నుంచి అమెరికాకు ట్రిలియన్ల డాలర్ల ఆదాయం వచ్చిందన్నారు. సుంకాల నుంచి వచ్చిన ఆదాయంతో అమెరికా 37 ట్రిలియన్ డాలర్ల రుణాలు తీర్చడానికి సహాయపడిందని అన్నారు.

Advertisement

అమెరికాలో అన్ని చోట్ల ప్లాంట్లు, కర్మాగారాలు పెరుగుతున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ప్రతి వ్యక్తికి కనీసం 2,000 డాలర్ల డివిడెండ్ అందుతుందన్నారు. దీనిపై అధికారిక ఉత్తర్వులను ఇంకా ప్రకటించలేదు.

అమెరికన్లకు 2,000 డాలర్ల డివిడెండ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికన్లకు 2,000 డాలర్ల టారిఫ్ ప్రకటించారు. అమెరికా టారిఫ్ ఆదాయాల ద్వారా నిధులు సమకూరుతాయన్నారు. ట్రిలియన్ డాలర్లు అమెరికాకు టారిఫ్‌ల రూపంలో అందుతున్నాయి. ఈ ఆదాయాన్ని అధిక సంపాదన ఉన్న వారిని మినహాయించి దేశ రుణాన్ని తగ్గించడానికి, పౌరులకు డివిడెంట్ ఇవ్వడానికి ఉపయోగిస్తామని అన్నారు. టారిఫ్ లో వలన రికార్డు స్థాయిలో స్టాక్ మార్కెట్లు 401(k) విలువలను చేరుకున్నాయన్నారు.

Related News

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

నేపాల్ ఖాకీలకు విచిత్ర సవాల్.. వరదల్లో కొట్టుకెళ్లిన మనుషులతో పాటు.. బ్యాంక్ లాకర్ల కోసం వేట!

బాంబులు, డ్రోన్ల మోత మధ్య జరిగిన పెళ్లి.. యుద్ధ సమయంలో పెరుగుతున్న వివాహాల సంఖ్య

Big Stories

Advertisement
×