E-Paper
Advertisement

Republic Day: గణతంత్ర వేడుకలకు ఆహ్వానం.. అంధుల క్రికెట్ కెప్టెన్ దీపికకు రాష్ట్రపతి లేఖ

Republic Day: గణతంత్ర వేడుకలకు ఆహ్వానం.. అంధుల క్రికెట్ కెప్టెన్ దీపికకు రాష్ట్రపతి లేఖ

Republic Day: భారత రాష్ట్రపతి నుంచి అంధుల క్రికెట్ కెప్టెన్ దీపికకు ఆహ్వానం.. గణతంత్ర వేడుకలకు ప్రత్యేక అతిథిగా ఎంపిక శ్రీ సత్యసాయి జిల్లా, తనకల్లు మండలం తంబాలహట్టి గ్రామానికి చెందిన భారత మహిళా అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 26న ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలను స్వయంగా వీక్షించాల్సిందిగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఆమెకు అధికారిక ఆహ్వానం అందింది. దేశం గర్వించదగ్గ క్రీడాకారిణిగా ఆమె సాధించిన విజయాలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

స్వగ్రామంలో అందజేసిన ఆహ్వాన పత్రం
రాష్ట్రపతి భవన్ నుండి అందిన ఈ ఆహ్వాన పత్రాన్ని తపాలా శాఖ అధికారులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి, నేరుగా దీపిక నివాసానికి వెళ్లి అందజేశారు. పోస్టల్ ఇన్‌స్పెక్టర్ జిలాన్ బాషా, మహిళా పోస్ట్ మాస్టర్ దివ్యభారతి తదితరులు తంబాలహట్టి గ్రామానికి చేరుకుని దీపికకు ఈ లేఖను స్వయంగా అందించారు. మారుమూల గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఒక క్రీడాకారిణికి రాష్ట్రపతి నుంచి పిలుపు రావడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అంధత్వాన్ని జయించి క్రికెట్ శిఖరాలకు దీపిక ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం. దీపికకు ఒక కన్ను చూపు కోల్పోయిన మనోధైర్యంతో క్రికెట్ రంగంలో అడుగుపెట్టిన ఆమె, తన అద్భుత ప్రతిభతో భారత మహిళా అంధుల జట్టుకు కెప్టెన్‌గా ఎదిగారు. అంతర్జాతీయ వేదికలపై భారత్ తరపున ఆడుతూ అనేక విజయాలను అందించారు. క్రీడల పట్ల ఆమెకున్న అంకితభావం, పట్టుదలే నేడు ఆమెను దేశ రాజధానిలో జరిగే అత్యున్నత వేడుకలకు అతిథిగా నిలబెట్టాయి.

అదృష్టంగా భావిస్తున్నానన్న దీపిక
రాష్ట్రపతి నుంచి ఆహ్వానం అందడంపై దీపిక తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. “దేశ ప్రథమ పౌరురాలి నుంచి పిలుపు రావడం నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి. ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలను కళ్లారా తిలకించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ గౌరవం నా బాధ్యతను మరింత పెంచింది” అని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Also Read: బంగారం కొందామనుకుంటున్నారా? అయితే ఈ షాకింగ్ న్యూస్ మీ కోసమే!

జిల్లా వ్యాప్తంగా ఆనందం..
శ్రీ సత్యసాయి జిల్లా నుంచి ఒక సామాన్య రైతు బిడ్డకు ఈ స్థాయి గుర్తింపు రావడం పట్ల జిల్లా యంత్రాంగం, క్రీడా అభిమానులు గర్వపడుతున్నారు. దీపిక సాధించిన ఈ విజయం గ్రామీణ ప్రాంతాల్లోని ఎంతో మంది ప్రతిభావంతులైన క్రీడాకారులకు మార్గదర్శకంగా నిలుస్తుందని ప్రముఖులు కొనియాడుతున్నారు. 26న ఢిల్లీ వెళ్లనున్న దీపికకు గ్రామస్థులు క్రీడా సంఘాలు ఘనంగా వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతున్నాయి.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×