E-Paper
Advertisement

వైసీపీని వెంటాడుతున్న ‘సర్’.. ఆపై జగన్ కీలక వ్యాఖ్యలు.. ఈ రెండూ డేంజరేనని వ్యాఖ్య

వైసీపీని వెంటాడుతున్న ‘సర్’.. ఆపై జగన్ కీలక వ్యాఖ్యలు.. ఈ రెండూ డేంజరేనని వ్యాఖ్య
Advertisement

Jagan On SIR: ఏపీవ్యాప్తంగా జూన్ 15 నుంచి ఎన్నికల సంఘం చేపట్టనున్న ‘SIR’ కార్యక్రమంపై మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.  ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు.  ఎస్‌ఐఆర్‌పై దేశవ్యాప్తంగా అనేక భయాలు, ఆందోళనలను రాజకీయ పార్టీలు వ్యక్తం చేయడాన్ని గుర్తు చేశారు. దీంతో వైసీపీలో సర్ గురించి కొత్త టెన్షన్ మొదలైంది.

వైసీపీని వెంటాడుతున్న ‘సర్’ భయం

Advertisement

బుధవారం తాడేపల్లి పార్టీ ఆఫీసులో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సర్‌పై మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్‌ఐఆర్‌పై దేశ వ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు భయాలు, ఆందోళనలు వ్యక్తం చేయడం చూశామన్నారు. అంతేకాదు ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలను ప్రభావితం చేసిందన్న వాదనలను గుర్తు చేశారు.

పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు ఏం జరిగిందో అంతా చూశారని వివరించారు. బెంగాల్‌లో 91 లక్షలు, తమిళనాడులో 74 లక్షలు మొత్తం ఓట్లలో తొలగించారు. చివరకు మమతా బెనర్జీ పోటీచేసిన భవానీపూర్‌లో 44,990 ఓట్లను తొలగించారని, అందుకే ఆమె అక్కడ ఓడిపోయారని చెప్పుకొచ్చారు.

Advertisement

జగన్ కీలక వ్యాఖ్యలు.. ఈ రెండూ డేంజరేనని వ్యాఖ్య

తమిళనాడులో స్టాలిన్‌ పోటీ చేసిన నియోజకవర్గంలో అదే పరిస్థితి ఎదురైందని, ఆయన ఓటమి పాలయ్యారని గుర్తు చేశారు. బెంగాల్‌లో తొలగించిన ఓట్లు 91 లక్షలని వివరించారు. ఆ రాష్ట్రంలో టీఎంసీ కేవలం 31 లక్షల తేడాతో ఓటమిపాలైంది. తమిళనాడులో తొలగించింది 74 లక్షల అయితే, డీఎంకే పార్టీ 17 లక్షల తేడాతో ఓడిపోయిందని లెక్కలతో సహా వివరించారు.

అందుకే వచ్చేనెల 15 నుంచి ఎన్నికల సంఘం చేపట్టనున్న ఎస్‌ఐఆర్‌పై పార్టీ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని సూచన చేశారు. ఏపీలో ఓట్లు పెరగడం వల్ల వైసీపీ ఓటమి పాలైందని, తమిళనాడు-బెంగాల్‌లో ఓట్లు తొలగించడం వల్ల అధికార పార్టీలు ఓడిపోయాయని, రెండూ డేంజరేనని చెప్పుకొచ్చారు.

ALSO READ: ‘మహానాడు’ వేదికగా సరికొత్త రికార్డు.. లోకేష్ బాధ్యతలపై ఎంపీ శ్రీభరత్ కీలక వ్యాఖ్యలు!

ఒక్కో ఊరికి 50 ఓట్లు తొలగిస్తే నియోజకవర్గానికి 5 వేలు పోయినట్టేనని మనసులోని మాట బయటపెట్టారు. కేవలం మన ఓట్ల గురించే కాకుండా అదే సమయంలో టీడీపీ బోగస్‌ ఓట్ల మీద దృష్టి పెట్టాలని సూచించారు. ఏపీలో ఓట్ల జాబితా ఓ మిస్టరీ అని, తప్పుడు ఓట్లు మీద దృష్టి పెట్టాలని కేడర్ దిశానిర్ధేశం చేశారు.

Related News

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

గుంటూరులో మంటగలిసిన మానవత్వం.. మహిళపై దాడి చేయించిన టీడీపీ నేత, పార్టీ నుంచి సస్పెండ్!

విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్ – 1, ఈ హైదరాబాద్ రాకెట్ ప్రత్యేకత ఇదే..!

ఏపీలో మారిన వాతావరణం.. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు, పిడుగుల హెచ్చరిక!

కరోనా ఈజ్ బ్యాక్.. ఏపీలో 12 కేసులు.. ఆ నలుగురి మరణానికి అసలు కారణం ఇదేనా?

Big Stories

Advertisement
×