E-Paper
Advertisement

Jagan Moves AP High Court: హైకోర్టును ఆశ్రయించిన జగన్.. ప్రతిపక్ష హోదా ఇప్పించాలంటూ రిక్వెస్ట్

Jagan Moves AP High Court: హైకోర్టును ఆశ్రయించిన జగన్.. ప్రతిపక్ష హోదా ఇప్పించాలంటూ రిక్వెస్ట్
Advertisement

Jagan Moves AP High Court: ప్రతిపక్ష నేత హోదా కోసం వైఎస్ జగన్ తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని గతంలో ఆయన స్పీకర్ లేఖ రాశారు. అయితే, ఆ హోదా ఇచ్చేందుకు స్పీకర్ నిరాకరించారు. ఆయనను కేవలం వైసీపీ ఫ్లోర్ లీడర్ గానే గుర్తిస్తున్నట్లు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని స్పీకర్ ను ఆదేశించాలంటూ అందులో పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత హోదా కోసం లేఖ రాసినా కూడా ఇవ్వలేదంటూ ఆ పిటిషన్ లో ప్రస్తావించారు.

Also Read: విశాఖ శారదా పీఠాధిపతికి భద్రతను కుదించిన ప్రభుత్వం

Advertisement

కాగా, ఏపీలో అధికార పార్టీ కాకుండా ఉన్న మరో పార్టీ తమదేనంటూ జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధమంటూ వాదిస్తూ వస్తున్నారు. అసెంబ్లీ మొత్తం సభ్యుల్లో 10 శాతం సీట్లు ఉంటేనే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని రాజ్యాంగంలో లేదంటూ జగన్ ఇంతుకుముందు స్పీకర్ కు లేఖ రాశారు. మామూలుగా అయితే 10 శాతం సీట్లు వస్తే వారిని ప్రతిపక్ష నేతగా గుర్తిస్తారు. రెండు, మూడు పార్టీలకు 10 శాతం కంటే ఎక్కువ సీట్లు వస్తే.. ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీ స్పీకర్ గుర్తిస్తారు. కానీ, ఏపీలో గత ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. కనీసం 18 సీట్లు వచ్చి ఉంటే ఈ విధంగా జగన్ మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని స్పీకర్ ను అడగాల్సి వచ్చేది కాదు.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×