BigTV English

Jagan : కోడికత్తి కేసు.. విచారణకు రాలేను.. కోర్టులో జగన్ పిటిషన్..

Jagan : కోడికత్తి కేసు.. విచారణకు రాలేను.. కోర్టులో జగన్ పిటిషన్..

Jagan : 2019 ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో కోడికత్తితో దాడి జరగడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. తాజాగా ఈ కేసులో సీఎం జగన్ కోర్టులో‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టులో జరుగుతోంది. జగన్ విచారణకు హాజరుకావాలని గత విచారణ సమయంలో మెజిస్ట్రేట్‌ ఆదేశించారు. ఈ నేపథ్యంలో తాజాగా జగన్‌ పిటిషన్‌ వేశారు. అడ్వకేట్‌ కమిషనర్‌ ద్వారా సాక్ష్యం నమోదుకు అవకాశం ఇవ్వాలని కోరారు.


రాష్ట్రానికి సీఎంగా అనేక బాధ్యతలున్నాయని జగన్ పిటిషన్ లో పేర్కొన్నారు.పేదలకు అందించే సంక్షేమ పథకాలపై సమీక్ష సమావేశాలు ఉన్నాయని తెలిపారు. కోర్టుకు సీఎం హాజరైతే భద్రత కోసం వచ్చే వాహనాలతో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. అడ్వకేట్‌ కమిషనర్‌ను నియమించి ఆయన సమక్షంలో సాక్ష్యం నమోదు చేయించాలని కోరారు.

ఈ కేసు దర్యాప్తును లోతుగా జరపాలని కోరుతూ మరో పిటిషన్‌ను కూడా సీఎం జగన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఈ నెల 13న విచారణ జరుపుతామని ఎన్‌ఐఏ కోర్టు ప్రకటించింది.


Related News

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

Big Stories

×