E-Paper
Advertisement

Jagan : కోడికత్తి కేసు.. విచారణకు రాలేను.. కోర్టులో జగన్ పిటిషన్..

Jagan : కోడికత్తి కేసు.. విచారణకు రాలేను.. కోర్టులో జగన్ పిటిషన్..

Jagan : 2019 ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో కోడికత్తితో దాడి జరగడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. తాజాగా ఈ కేసులో సీఎం జగన్ కోర్టులో‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టులో జరుగుతోంది. జగన్ విచారణకు హాజరుకావాలని గత విచారణ సమయంలో మెజిస్ట్రేట్‌ ఆదేశించారు. ఈ నేపథ్యంలో తాజాగా జగన్‌ పిటిషన్‌ వేశారు. అడ్వకేట్‌ కమిషనర్‌ ద్వారా సాక్ష్యం నమోదుకు అవకాశం ఇవ్వాలని కోరారు.

రాష్ట్రానికి సీఎంగా అనేక బాధ్యతలున్నాయని జగన్ పిటిషన్ లో పేర్కొన్నారు.పేదలకు అందించే సంక్షేమ పథకాలపై సమీక్ష సమావేశాలు ఉన్నాయని తెలిపారు. కోర్టుకు సీఎం హాజరైతే భద్రత కోసం వచ్చే వాహనాలతో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. అడ్వకేట్‌ కమిషనర్‌ను నియమించి ఆయన సమక్షంలో సాక్ష్యం నమోదు చేయించాలని కోరారు.

ఈ కేసు దర్యాప్తును లోతుగా జరపాలని కోరుతూ మరో పిటిషన్‌ను కూడా సీఎం జగన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఈ నెల 13న విచారణ జరుపుతామని ఎన్‌ఐఏ కోర్టు ప్రకటించింది.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×