E-Paper
Advertisement

Jahnavi Missing Case: జాహ్నవి మిస్సింగ్ కేసు.. పోలీసులు కీలక ప్రకటన, ఆచూకీ చెబితే లక్ష బహుమతి

Jahnavi Missing Case: జాహ్నవి మిస్సింగ్ కేసు.. పోలీసులు కీలక ప్రకటన, ఆచూకీ చెబితే లక్ష బహుమతి
Advertisement

Jahnavi Missing Case: రెండేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమై దాదాపు నెల రోజులు కావస్తోంది.  ఐనప్పటికీ ఆచూకీ లభించలేదు. డజను ప్రత్యేక బృందాలు గాలించినా ఎలాంటి ఫలితం దక్కలేదు. మరోవైపు పోలీసులు దర్యాప్తులో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో కీలక ప్రకటన చేశారు. చిన్నారి ఆచూకీ చెప్పిన వారికి లక్ష నగదు బహుమతి ప్రకటించారు.

కాకినాడ జిల్లాలో జాహ్నవి మిస్సింగ్ కేసు

Advertisement

కాకినాడ జిల్లా తునిలోని సీహెచ్ ఆగ్రహానికి చెందిన 26 రోజుల కిందట అదృశ్యమైంది రెండేళ్ల చిన్నారి జాహ్నవి. ఇప్పటికీ చిన్నారి కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. ఓ వైపు పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. మరోవైపు డ్రోన్ల సాయంతో ముమ్మరం గాలింపు చేపట్టారు. కనీసం పాప జాడ కనిపించలేదు. తల్లిదండ్రులు మాత్రం కూతురు కనిపించలేదని అల్లాడిపోతున్నారు.

అదృశ్యమై 26 రోజులు గడిచినా ఎలాంటి జాడ కనిపించలేదు. ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. దాదాపు 12 బృందాలు గాలింపు చేపట్టాయి కూడా. ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో తుని పోలీసులు కీలక ప్రకటన చేశారు. చిన్నారి ఆచూకీ చెప్పినవారికి లక్ష నగదు బహుమతి ఇస్తామన్నారు.

Advertisement

పోలీసులు కీలక ప్రకటన, ఆచూకీ చెబితే లక్ష బహుమతి

సమాచారం అందజేసినవారి పేరు గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు. సుంకర జ్ఞానేశ్వరి అలియాస్ జాహ్నవి ఫోటోతో ప్రకటన ఇచ్చారు. కేవలం సోషల్ మీడియాలోనే కాదు.. గోడ పత్రిక తుని మొత్తమంతా అంటించారు. కాకినాడ, రాజమండ్రి, విశాఖ జిల్లాల్లో గోడ పత్రికలు వీటిని అతికించారు. ఎవరికైనా తెలిస్తే 9440796508, 9440796531, 9440796573కు సమాచారం ఇవ్వాలని తుని రూరల్‌ సీఐ చెన్నకేశవరావు తెలియజేశారు.

చిన్నారి జాహ్నవి కోసం తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ బిడ్డ క్షేమంగా తిరిగి రావాలని వారు చేయని పూజలు లేవు. ఎన్నో దేవుళ్లకు సైతం మొక్కుకున్నారు. జూన్ 6న మధ్యాహ్నం 11.30 గంటల సమయంలో ఇంటి వద్ద ఆడుకుంటున్న జాహ్నవి కనిపించకుండా పోయింది. పాపతో పాటు పెంపుడు శునకం అదృశ్యమైంది.

ALSO READ: SIR ప్రక్రియపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. ప్రభుత్వంపై రుసరుస, మావిగన్ పై కీలక వ్యాఖ్యలు

కొన్ని రోజులకు ఆ శునకం ఇంటికి చేరినప్పటికీ, పాప రాలేదు. దీంతో తల్లిదండ్రుల్లో టెన్షన్ పెరిగిపోయింది. చివరకు ఇంటికి వచ్చిన శునకం మృతి చెందింది. ఆ శునకం ఊరిలో ప్రధాన రహదారిపై తిరుగుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. కానీ జాహ్నవి ఎటువైపు వెళ్లిందనే దానిపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ ప్రకటన చేశారు.

Related News

శ్రీశైలం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కిక్కిరిసి పోతున్న వాహనాలు!

చోడవరంలో దారుణం.. భర్తను నరికి చంపి, తల వద్ద దీపం పెట్టిన భార్య!

గుండెల్లో బలమైన అజెండా ఉండాలి.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్

తిరుపతి స్వాతంత్ర్య వేడుకల్లో మంత్రి ఆనంకు అస్వస్థత.. అప్రమత్తమైన కలెక్టర్, ఎస్పీ!

ఏపీలో మెగా DSC అక్రమాల సెగ.. నలుగురు టీచర్లు సస్పెండ్!

చంద్రబాబు ప్రభుత్వంపై బొత్స ఘాటు వ్యాఖ్యలు.. మళ్లీ బ్రిటీష్ పాలన తలపించేలా..

పెమ్మసాని ఫొటో మార్ఫింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. అంబటికి హైకోర్టు సమన్లు!

వ్యక్తిగత దూషణలు చేయవద్దు.. జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ వార్నింగ్!

Big Stories

Advertisement
×