BigTV English

Allegations again on CS JawaharReddy: దేనికైనా సిద్ధమే? భోగాపురంపై ఎందుకంత ప్రేమ?

Allegations again on CS JawaharReddy: దేనికైనా సిద్ధమే? భోగాపురంపై ఎందుకంత ప్రేమ?

Allegations again on CS Jawaharreddy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి సీఎస్ జవహర్‌ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్. తాను చేసిన ఆరోపణలు ముమ్మాటికీ నిజమేనని కుండబద్దలు కొట్టారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, ఒక్క భోగాపురం మీదే ఆయనకు ఎందుకుంత ప్రేమని సూటిగా ప్రశ్నించారు. కుమారుడ్ని ముందే అక్కడికి పంపి అగ్రమెంట్ చేసుకున్నారంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు.


నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్పుకునే ప్రభుత్వం చేసిన న్యాయం ఇదేనా అని అన్నారు విశాఖ కార్పొరేటర్. ఈ విషయంలో సీఎస్ జవహర్‌రెడ్డికి నిజంగా చిత్తశుద్ది ఉంటే సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన జీవో నెంబర్ 596 బయటకు వచ్చిన నుంచి ఇప్పటివరకు జరిగిన లావాదేవీలపై విచారణ చేయించాలన్నారు.

ఆదివారం విశాఖలో మీడియాతో మాట్లాడిన మూర్తి, తన ఆరోపణలు అవాస్తమైతే ఏ శిక్షకైనా సిద్ధమేనని ప్రకటించారు. జగన్ వైఫ్ భారతి పేరు చెప్పి ఈ లావాదేవీలన్నీ వేగంగా జరిగేలా చేశారని, ఇప్పుడు ఆ ప్రాంతంలోని భూములు రైతుల చేత్తుల్లో లేవన్నారు. త్వరలో దీని వెనుకున్న ఎమ్మార్వో పేర్లు బయటపెడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు.


ALSO READ: చీఫ్ సెక్రటరీ కాదు.. చీప్ సెక్రటరీ : సీఎస్ పై సోమిరెడ్డి ఫైర్

వైసీపీ ప్రభుత్వం మళ్లీ రాదని తెలిసి రహస్యంగా లావాదేవీలు జరిపారని ఆరోపించారు మూర్తి యాదవ్. సీఎస్ కొడుకు ఉత్తరాంధ్రలో బినామీల పేర్లతో దాదాపు 800 ఎకరాల భూములను కాజేశారని దుయ్య బట్టారు. ముఖ్యంగా ఫ్రీ హోల్డ్ పత్రాలు తీసుకుని భూములు దోచేశారన్నారు. విజయనగరం, విశాఖలోని భీమిలిపట్నంలో ఆయా భూములకు సంబంధించిన డీటేల్స్‌ను బయటపెట్టారు. దీనిపై పూర్తి స్థాయిలో తన వద్ద సమాచారం ఉందన్నారు.

మరోవైపు మూర్తి యాదవ్ ఆరోపణలపై శనివారం సీఎస్ జవహర్‌రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. విశాఖ పరిసర ప్రాంతాల్లో తాను తన ఫ్యామిలీ సభ్యులు, బంధువులు ఎలాంటి అసైన్డ్ భూములు కొనలేదన్నారు. తన కుమారుడు ఉత్తరాంధ్రలోని ఏ జిల్లాకు వెళ్లలేదని పేర్కొన్నారు. మూర్తి ఆరోపణలను తీవ్రంగా ఖండించారాయన. చట్ట సభ ఆమోదం మేరకు జీవో జారీ అయ్యిందన్నారు. దాన్ని తనకు ఆపాదించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. తనపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోని పక్షంలో పరువునష్టం దావా వేస్తానన్నారు. దీనిపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. మొత్తానికి భూముల వ్యవహారం రానున్న రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Tags

Related News

AP Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి అతి భారీ వర్ష సూచన.. రేపు ఈ జిల్లాల్లో

YS Jagan: మీది రెడ్ బుక్ అయితే.. మాది డిజిటిల్ బుక్, కథ వేరే ఉంటది.. జగన్ సంచలన వ్యాఖ్యలు

Yellow Shirt: అసలైన పసుపు సైనికుడు.. కూతురు పెళ్లిలో కూడా పసుపు చొక్కానే

Roja Hot Comments: శుక్రవారం వస్తే జంప్.. జగన్‌పై రోజా సెటైర్లు?

Digital Book: డిజిటల్ బుక్‌తో వైసీపీ వార్నింగ్.. రెడ్ బుక్ విజృంభించే టైమ్ వచ్చిందా?

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Big Stories

×