E-Paper
Advertisement

JC Prabhakar Reddy: న్యూ ఇయర్ వేడుకలకు మాధవీలతే చీఫ్ గెస్ట్: జేసీ ప్రభాకర్ రెడ్డి

JC Prabhakar Reddy: న్యూ ఇయర్ వేడుకలకు మాధవీలతే చీఫ్ గెస్ట్: జేసీ ప్రభాకర్ రెడ్డి
Advertisement

JC Prabhakar Reddy: తాడిపత్రి పట్టణంలో న్యూ ఇయర్‌ వేడుకల నిర్వహణకు మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఈసారి మూడు రోజుల పాటు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తామని జేసీ ప్రకటించారు. న్యూ ఇయర్ వేడుకలకు సినీ నటి మాధవీలతను ఆహ్వానిస్తామన్నారు. పెన్నానది ఒడ్డున ఉన్న పార్కులోనే వేడుకలకు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్‌ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సారి న్యూ ఇయర్‌ వేడుకలకు సినీనటి మాధవీలతను ఆహ్వానిస్తున్నాం, ఆమె వస్తారో, రారో తెలియదన్నారు.

మూడు రోజుల పాటు వేడుకలు

గతేడాది పెన్నానది ఒడ్డున పార్కులో న్యూ ఇయర్‌ వేడుకల నిర్వహించారు జేసీ. మహిళలకు మాత్రమే అనుమతి అంటూ జేసీ చెప్పడంతో వివాదాస్పదం అయింది. ఈ వేడుకలపై మాధవీలత విమర్శలు చేశారు. ఆ వ్యవహారంలో తాము రాజీ అయ్యామనీ, దీంతో మాధవీలతను న్యూ ఇయర్ వేడుకలకు ఆహ్వానించాలనుకున్నామన్నారు. రావడం ఆమె ఇష్టమని చెప్పారు. ఈ నెల 29న చిన్నపిల్లలకు అనుమతి అని అందుకు ఏర్పాట్లు చేశామన్నారు. డిసెంబర్ 30న యువకులకు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయన్నారు. 31న పెద్దలను అనుమతిస్తామని జేసీ చెప్పారు. 29, 30 తేదీల్లో జరిగే వేడుకలకు అందరూ రావొచ్చన్నారు.

ఈసారి మాధవీలత చీఫ్ గెస్ట్

Advertisement

గ‌తంలో హీరోయిన్ మాధ‌వీల‌త త‌మ‌పై అభాండాలు వేశారని, ఈసారి ఆమెతో కాంప్రమైజ్ అయ్యామ‌న్నారు. ఇద్దరం స్వారీ చెప్పుకున్నామ‌ని జేసీ అన్నారు. ఈ సారి మాధ‌వీల‌త‌నే న్యూ ఇయర్ వేడుకలకు చీఫ్ గెస్ట్ అని చెప్పారు. త‌ప్పైందని స్వారీ చెప్పాన‌ని, ఆమె కూడా స్వారీ చెప్పడంతో కాంప్రమైజ్ అయ్యామ‌ని అన్నారు. న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌ను ఒక్కో రోజు ఒక్కో విధంగా నిర్వహించాలని ప్లాన్ చేశామని జేసీ అన్నారు.

Also Read: Parakamani Theft Case: పరకామణి చోరీ కేసులో కీలక పరిణామం.. కొత్త ఎఫ్ఐఆర్ దిశగా సీఐడీ అడుగులు!

గతేడాది వివాదం

Advertisement

గతేడాది డిసెంబర్ 31న తాడిపత్రి పార్కులో జేసీ ప్రభాకర్ రెడ్డి న్యూఇయర్ వేడుకలు నిర్వహించారు. మహిళల కోసం జేసీ ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించారు. ఆ వేడుకలకు వెళ్లొద్దంటూ మాధవీలత సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారు. దీంతో ఆమెపై జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×