Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబానికి కష్టాలు రెట్టింపు అవుతున్నాయి. ఆయన కుటుంబ సభ్యులకు ఎదురవుతున్న న్యాయపరమైన చిక్కుల్లో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. వరకట్న వేధింపులు, హత్యాయత్నం కేసు ఎదుర్కొంటున్న జోగి కుటుంబసభ్యులు ముందస్తు రక్షణ కోసం విజయవాడలోని మహిళా స్పెషల్ కోర్టును ఆశ్రయించారు.
ముందస్తు చర్యల నుంచి ఉపశమనం కోసం..
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా పోలీసులు తమను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ఉద్దేశంతో.. ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా పోలీసులను నియంత్రించాలని కోరుతూ జోగి కుటుంబ సభ్యులు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తమకు న్యాయం చేయాలని కోర్టు ముందు విజ్ఞప్తి చేశారు.
ఆగస్టు 4కి విచారణ వాయిదా
ఈ పిటిషన్లపై మహిళా స్పెషల్ కోర్టు విచారణ చేపట్టింది. కేసు వివరాలపై పూర్తిస్థాయి కౌంటర్ దాఖలు చేయాలని ఇబ్రహీంపట్నం పోలీసులను ఆదేశించింది. పోలీసుల వైఖరి, కేసు వివరాలు తెలుసుకున్న తర్వాతే నిర్ణయం వెలువరిస్తామని చెబుతూ.. తదుపరి విచారణను ఆగస్టు 4వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో కోర్టు తీర్పు ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also Read: కాళేశ్వరం కట్టింది వాళ్లే.. కూల్చింది వాళ్లే.. కేటీఆర్పై మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ఫైర్!