BigTV English

KA Paul comments on Jagan, Pawan: కేఏపాల్ కొత్త పలుకులు, జగన్, పవన్ ఇంకా షాక్‌లోనే

KA Paul comments on Jagan, Pawan: కేఏపాల్ కొత్త పలుకులు, జగన్, పవన్ ఇంకా షాక్‌లోనే

KA Paul comments on Jagan, Pawan(Andhra politics news): ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. టీడీపీ సునామీకి కాకలు తీరిన వైసీపీ నేతలు సైతం మట్టి కరిచారు. ఎలా ఓడి పోయామన్నది ఇప్పటికీ ఆయా నేతలకు అంతుబట్టడం లేదు. దీనిపై ఇప్పుడిప్పుడు అంతర్మథనం చేసుకునే పనిలోపడ్డారు.


ఈ విషయంలో ప్రజాశాంతి చీఫ్ ఏకె పాల్ తొందరగానే తేరుకున్నారు. అంతేకాదు మీడియా ముందుకొచ్చి తాను చెప్పాల్సిన నాలుగు ముక్కలు చెప్పేశారు. పోటీ చేసిన అన్ని సీట్లలో జనసేన పార్టీ గెలవడంతో పవన్ కల్యాణ్ షాక్‌లో ఉన్నారని తెలిపారు. ఏం మాట్లాడాలో ఆయనకు అర్థంకావడం లేదని తనదైనశైలిలో చెప్పుకొచ్చారు.

ఎన్నికల విషయంలో అందరి కంటే ఎక్కువగా షాక్‌కు గురైన వ్యక్తుల్లో సీఎం జగన్ ముందు ఉంటారన్నారు కేఏ పాల్. తనపై కేసులున్నాయన్న విషయమా? లేక సర్వేలు ప్రకారం సీట్లు రాలేదన్న షాక్‌ నుంచి ఆయన ఇంకా తేరుకున్నట్లు కనిపించలేదన్నారు. డీబీటీ ద్వారా కోట్ల రూపాయలు ప్రజలకు ట్రాన్స్‌ఫర్ చేసినా దారుణంగా ఓడిపోయామనే షాక్‌లో ఉన్నట్లు చెప్పుకొచ్చారు.


ALSO READ: అయ్యన్న ఆగ్రహం.. ప్రతీకారం తప్పదు, జగన్‌కు ఆ శాపం…

విశాఖ లోక్‌‌సభ అభ్యర్థిగా పోటీ చేసిన తనకు ఓటు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు కేఏ పాల్. దాదాపు 9 లక్షల ఓట్లు కూటమి అభ్యర్థి ఎలా పడ్డాయని ఆశ్చర్యపోతున్నారని అన్నారు. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం వల్లే ఇలాంటి ఫలితాలు వచ్చాయన్నారు. కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వస్తుందని తాను ముందే చెప్పానని వివరించారు కేఏ పాల్.

తనకు కేవలం నాలుగు ఓట్లు మాత్రమే పడ్డాయని, కొన్ని బూత్లలో ఒక్క ఓటు పడలేదన్నారు పాల్. మా ఇంట్లో ఉన్న 22 ఓట్లు ఏమయ్యాయో, ఎవరికి పడ్డాయో తెలియడం లేదన్నారు. మళ్ళీ రిపోలింగ్ జరపాలని మనసులోని మాట బయటపెట్టారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.

 

 

Tags

Related News

Mega DSC Utsav: 150 రోజుల్లో 15,941 మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి.. ఇక ప్రతి ఏటా టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్

Uppada: పవన్ భరోసా.. ఉప్పాడలో ఆందోళన విరమించిన మత్స్యకారులు

Tirumala Geo Tagging: తిరుమలలో భక్తుల భద్రతకు టీటీడీ వినూత్న ఆలోచన.. పిల్లలు, సీనియర్ సిటిజన్లకు జియో ట్యాగింగ్

Amaravati – Jagan: అమరావతి పై వైసీపీ వైఖరి చెప్పాల్సింది సజ్జల కాదు జగన్.. ఏపీ అసెంబ్లీ లో ఆసక్తికర ప్రస్తావన

Ontimitta Sri Rama Statue: ఒంటిమిట్టలో శ్రీ రాముడి 600 అడుగుల విగ్రహం

AP Assembly Session: సీఎంపై వైసీపీ ఎమ్మెల్సీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. మండలిలో రచ్చ రచ్చ

Cm Chandrababu: అసెంబ్లీకి ఎమ్మెల్యేలు డుమ్మా.. సీఎం చంద్రబాబు సీరియస్

Ayyanna vs Jagan: జగన్ రప్పా రప్పా కామెంట్స్.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం, ఆయన్ని చూసి నేర్చుకో

Big Stories

×