E-Paper
Advertisement

Kakinada Port Case: ఈడీ ముందుకు విజయసాయిరెడ్డి.. ఆ కేసులో జగన్‌ను ఇరికిస్తారా?

Kakinada Port Case: ఈడీ ముందుకు విజయసాయిరెడ్డి.. ఆ కేసులో జగన్‌ను ఇరికిస్తారా?
Advertisement

Kakinada Port Case: కాకినాడ సెజ్ వ్యవహారం వైసీపీ నేతలను వెంటాడుతోంది. దీనిపై ఈడీ రంగంలోకి దిగేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఈడీ ముందు హాజరయ్యారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇప్పటివరకు సేకరించిన ఆధారాలపై ఆయన్ని అధికారులు ఎంత సేపు విచారణ చేస్తారో చూడాలి.

కాకినాడ సీపోర్టు, సెజ్‌కు సంబంధించి షేర్ల బదలాయింపు వ్యవహారం దర్యాప్తు స్పీడందుకుంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి వచ్చారు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కర్నాటి వెంకటేశ్వరరావు(కేవీ రావు) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీలో కేసు నమోదైంది. దీని ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.

Advertisement

జగన్ ప్రభుత్వం హయాంలో వైసీపీకి చెందిన కొందరు నేతలు కాకినాడ సీ పోర్టు, కాకినాడ సెజ్‌లోని మేజర్ వాటాను బలవంతంగా తీసుకున్నారని కేవీ రావు ఫిర్యాదు చేశారు. రూ.2,500 కోట్ల విలువ చేసే 41 శాతం షేర్లను కేవలం రూ.494 కోట్లకు బలవంతంగా తీసుకున్నారని ప్రధాన పాయింట్. పోర్టుకు పక్కనేవున్న సెజ్‌లో రూ.1100 కోట్ల విలువ చేసే షేర్లను కేవలం రూ.12 కోట్లు తీసుకున్నారు.

దీనిపై ఓ వైపు సీఐడీ దర్యాప్తు చేస్తోంది. మరోవైపు ఈడీ కూడా లావాదేవీలపై ఆరా తీసింది. ఇందులో మనీ లాండరింగ్ జరిగినట్టు గుర్తించింది ఈడీ. ఈ క్రమంలో కేసు నమోదు చేయడం, కీలకంగా వ్యవహరించిన వారికి నోటీసులు ఇచ్చింది. ఫలానా తేదీన విచారణకు హాజరుకావాలని అందులో ప్రస్తావించింది. తమ పనుల నిమిత్తం విచారణకు రాలేవని తొలుత అందరూ ఈడీకి రిప్లై ఇచ్చారు. ఇవాళ వీఎస్ఆర్ ఈడీ ముందుకొచ్చారు. ఆ  తర్వాత మిగిలిన వారంతా రావచ్చన్నది ఈడీ అంచనా.

Advertisement

ALSO READ:  ఆ డీల్ వెనుక వైసీపీ నేత? శ్రీకాంత్‌ను చంపేస్తామంటున్న వ్యక్తులు వాళ్లేనా?

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×