BigTV English
Advertisement

Kakinada Port Case: ఈడీ ముందుకు విజయసాయిరెడ్డి.. ఆ కేసులో జగన్‌ను ఇరికిస్తారా?

Kakinada Port Case: ఈడీ ముందుకు విజయసాయిరెడ్డి.. ఆ కేసులో జగన్‌ను ఇరికిస్తారా?

Kakinada Port Case: కాకినాడ సెజ్ వ్యవహారం వైసీపీ నేతలను వెంటాడుతోంది. దీనిపై ఈడీ రంగంలోకి దిగేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఈడీ ముందు హాజరయ్యారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇప్పటివరకు సేకరించిన ఆధారాలపై ఆయన్ని అధికారులు ఎంత సేపు విచారణ చేస్తారో చూడాలి.


కాకినాడ సీపోర్టు, సెజ్‌కు సంబంధించి షేర్ల బదలాయింపు వ్యవహారం దర్యాప్తు స్పీడందుకుంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి వచ్చారు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కర్నాటి వెంకటేశ్వరరావు(కేవీ రావు) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీలో కేసు నమోదైంది. దీని ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.

జగన్ ప్రభుత్వం హయాంలో వైసీపీకి చెందిన కొందరు నేతలు కాకినాడ సీ పోర్టు, కాకినాడ సెజ్‌లోని మేజర్ వాటాను బలవంతంగా తీసుకున్నారని కేవీ రావు ఫిర్యాదు చేశారు. రూ.2,500 కోట్ల విలువ చేసే 41 శాతం షేర్లను కేవలం రూ.494 కోట్లకు బలవంతంగా తీసుకున్నారని ప్రధాన పాయింట్. పోర్టుకు పక్కనేవున్న సెజ్‌లో రూ.1100 కోట్ల విలువ చేసే షేర్లను కేవలం రూ.12 కోట్లు తీసుకున్నారు.


దీనిపై ఓ వైపు సీఐడీ దర్యాప్తు చేస్తోంది. మరోవైపు ఈడీ కూడా లావాదేవీలపై ఆరా తీసింది. ఇందులో మనీ లాండరింగ్ జరిగినట్టు గుర్తించింది ఈడీ. ఈ క్రమంలో కేసు నమోదు చేయడం, కీలకంగా వ్యవహరించిన వారికి నోటీసులు ఇచ్చింది. ఫలానా తేదీన విచారణకు హాజరుకావాలని అందులో ప్రస్తావించింది. తమ పనుల నిమిత్తం విచారణకు రాలేవని తొలుత అందరూ ఈడీకి రిప్లై ఇచ్చారు. ఇవాళ వీఎస్ఆర్ ఈడీ ముందుకొచ్చారు. ఆ  తర్వాత మిగిలిన వారంతా రావచ్చన్నది ఈడీ అంచనా.

ALSO READ:  ఆ డీల్ వెనుక వైసీపీ నేత? శ్రీకాంత్‌ను చంపేస్తామంటున్న వ్యక్తులు వాళ్లేనా?

Related News

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Big Stories

×