BigTV English
Advertisement

Hari Rama Jogayya Letter: ఆ విషయం మాటేంటి? సీఎం, డిప్యూటీ సీఎంలకు కాపు నేత లేఖ

Hari Rama Jogayya Letter: ఆ విషయం మాటేంటి? సీఎం, డిప్యూటీ సీఎంలకు కాపు నేత లేఖ

Hari Rama Jogayya Letter: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తి అయ్యింది. రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేకపోవడంతో రియాక్ట్ అయ్యారు కాపు నేత హరి రామజోగయ్య. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌‌కు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం లోకి ఒక్కసారి వెళ్దాం.


కాపు రిజర్వేషన్ కోసం గతంలో తాను ఆమరణ దీక్ష చేశాను. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్చించి సమిష్టి నిర్ణయం తీసుకుందామని చెప్పి పవన్ కళ్యాణ్ దీక్ష విరమింప చేశారని గుర్తు చేశారు హరి రామజోగయ్య. కాపు రిజర్వేషన్‌లపై గత టీడీపీ ప్రభుత్వం సానుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు కల్పించిన 10 శాతం రిజర్వేషన్లలో కాపులకు విద్య, ఉద్యోగాల్లో 5 శాతం ఇవ్వాలన్నది ఆయన కోరిక. గత వైసీపీ హయాంలో కాపు నిరుద్యోగ యువత నష్టపోయిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటించిన మెగా డీఎస్సీ‌లో కాపు నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు.


ఇటు కేంద్రం, అటు ఏపీలో ప్రభుత్వాల ఏర్పాటుకు పవన్ కళ్యాణ్ ముఖ్య కారణమని, 90 శాతం కాపులు బలపరచడం వల్లే కూటమి ప్రభుత్వం వచ్చిందన్నది ఆయన మాట. ఆందోళనలకు అవకాశం ఇవ్వకుండా రిజర్వేషన్లు విషయంలో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు హరి రామజోగయ్య. కూటమి సర్కార్ వచ్చిన మొదటి నెలలో హరి రామజోగయ్య రిజర్వేషన్లపై ప్రభుత్వానికి లేఖ రాయడం ఇది రెండోసారి.

ALSO READ: దావోస్‌లో తెలంగాణ-ఏపీ సీఎంలు.. అస్త్రాలు రెడీ

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×