BigTV English

Kesineni Brothers: ఉప్పు నిప్పుగా కేశినేని బ్రదర్స్.. బాబు చొరవతో వర్గపోరుకు శుభంకార్డు

Kesineni Brothers: ఉప్పు నిప్పుగా కేశినేని బ్రదర్స్.. బాబు చొరవతో వర్గపోరుకు శుభంకార్డు

Kesineni Brothers: బెజవాడలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రాజకీయాలు ఇప్పుడు చల్లారాయి. కేశినేని బ్రదర్స్‌ మధ్య నెలకొన్న పొలిటికల్‌ వార్‌ టీడీపీ అధినేత చంద్రబాబు చొరవతో.. ఉప్పు నిప్పుగా ఉన్న కేశినేని నాని, చిన్నిల మధ్య రాజకీయ విబేధాలు సద్దుమణిగాయి.


గత రెండేళ్లుగా కేశినేని బ్రదర్స్‌ మధ్య పొలిటికల్‌ వార్‌ సాగుతుండటంతో బెజవాడ రాజకీయాలు కాకరేపాయి. సోదరులిద్దరూ ఎంపీ సీటు కోసం పట్టుపట్టడంతో ఇరువురి మధ్య పొలిటిల్‌ వార్‌ స్టార్ట్‌ అయింది. ఇదిలా ఉంటే.. బుద్దా వెంకన్న కారణంగానే మొదట్లో చంద్రబాబుకి నాని దూరం అయ్యారు. ఇదే అదునుగా దేవినేని ఉమ చిన్నిను రంగంలోకి దించడంతో రాజకీయ రగడ రాజుకుంది. ఇక అప్పటి నుంచి వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రసవత్తరంగా పొలిటికల్‌ వార్‌ నడిచింది.

అయితే.. మరికొన్ని రోజుల్లోనే ప్రజా క్షేత్ర పోరు ఉండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు చర్చలతో వీరి పంచాయితీ ముగిసినట్టయింది. మరల ఎంపీగా నానికి టికెట్‌ ఇస్తానని..పెనమలూరు గాని మైలవరం నుంచి కానీ చిన్నిని బరిలో దించుతానని హామీ ఇవ్వడంతో ఇద్దరు నేతలు కూడా అందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ పంచాయితీ ముగియడంతో కేశినేని బ్రదర్స్‌ మధ్య ఎలాంటి ఆస్తి తగాదాలు లేవని.. కేవలం రాజకీయా డ్రామాలాడారని విమర్శిస్తున్నారు తోటి తెలుగు తమ్ముళ్లు.


Related News

AP rains alert: మోస్తారు నుండి భారీ వర్షాలు.. రాబోయే 3 రోజులు జాగ్రత్త తప్పనిసరి!

Amaravati ORR: అమరావతి ORRకు వేగం.. భూసేకరణ మొదలు.. ఆ నగరాలకు పండగే!

AP Liquor Case: లిక్కర్ కేసులో నెక్ట్స్ ఎవరు? నారాయణస్వామి నిజాలు, ఈసారి నేరుగా అరెస్టులే?

Anantapur News: దగ్గుపాటి ఆఫీస్ వద్ద టెన్షన్.. ముట్టడికి జూనియర్ ఫ్యాన్స్, చెదరగొట్టిన పోలీసులు

Vangaveeti Statue: వంగవీటి రంగా విగ్రహం.. నిందితుడు దొరికాడు, వెనుక ఎవరున్నారు?

YS Jagan: బీజేపీకి దగ్గరై.. జగన్ సక్సెస్ అవుతాడా?

Big Stories

×