E-Paper
Advertisement

Kesineni Brothers: ఉప్పు నిప్పుగా కేశినేని బ్రదర్స్.. బాబు చొరవతో వర్గపోరుకు శుభంకార్డు

Kesineni Brothers: ఉప్పు నిప్పుగా కేశినేని బ్రదర్స్.. బాబు చొరవతో వర్గపోరుకు శుభంకార్డు
Advertisement

Kesineni Brothers: బెజవాడలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రాజకీయాలు ఇప్పుడు చల్లారాయి. కేశినేని బ్రదర్స్‌ మధ్య నెలకొన్న పొలిటికల్‌ వార్‌ టీడీపీ అధినేత చంద్రబాబు చొరవతో.. ఉప్పు నిప్పుగా ఉన్న కేశినేని నాని, చిన్నిల మధ్య రాజకీయ విబేధాలు సద్దుమణిగాయి.

గత రెండేళ్లుగా కేశినేని బ్రదర్స్‌ మధ్య పొలిటికల్‌ వార్‌ సాగుతుండటంతో బెజవాడ రాజకీయాలు కాకరేపాయి. సోదరులిద్దరూ ఎంపీ సీటు కోసం పట్టుపట్టడంతో ఇరువురి మధ్య పొలిటిల్‌ వార్‌ స్టార్ట్‌ అయింది. ఇదిలా ఉంటే.. బుద్దా వెంకన్న కారణంగానే మొదట్లో చంద్రబాబుకి నాని దూరం అయ్యారు. ఇదే అదునుగా దేవినేని ఉమ చిన్నిను రంగంలోకి దించడంతో రాజకీయ రగడ రాజుకుంది. ఇక అప్పటి నుంచి వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రసవత్తరంగా పొలిటికల్‌ వార్‌ నడిచింది.

Advertisement

అయితే.. మరికొన్ని రోజుల్లోనే ప్రజా క్షేత్ర పోరు ఉండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు చర్చలతో వీరి పంచాయితీ ముగిసినట్టయింది. మరల ఎంపీగా నానికి టికెట్‌ ఇస్తానని..పెనమలూరు గాని మైలవరం నుంచి కానీ చిన్నిని బరిలో దించుతానని హామీ ఇవ్వడంతో ఇద్దరు నేతలు కూడా అందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ పంచాయితీ ముగియడంతో కేశినేని బ్రదర్స్‌ మధ్య ఎలాంటి ఆస్తి తగాదాలు లేవని.. కేవలం రాజకీయా డ్రామాలాడారని విమర్శిస్తున్నారు తోటి తెలుగు తమ్ముళ్లు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×