E-Paper
Advertisement

Kodali Nani : తెలంగాణలో జనసేన పరిస్థితి చూశాం.. ఇక ఏపీలోనూ అంతే : కొడాలి నాని

Kodali Nani | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో బీజేపీ పొత్తు పెట్టుకున్నజనసేన పరిస్థితి చూశాం.. ఇక ఏపీలో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే.. జనసేన పరిస్థితి మళ్లీ అలాగే ఉంటుందని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. టిడిపికి ప్రతిపక్షం హోదా కోసం చంద్రబాబు జనసేనతో పొత్తుపెట్టుకున్నారని.. అలాగే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవ్వడానికే టిడిపీతో పొత్తు పెట్టుకున్నారని కొడాలి నాని ఎద్దేవా చేశారు.

Kodali Nani : తెలంగాణలో జనసేన పరిస్థితి చూశాం.. ఇక ఏపీలోనూ అంతే : కొడాలి నాని
Advertisement
Kodali Nani latest comments

Kodali Nani latest comments(AP Politics):

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో బీజేపీ పొత్తు పెట్టుకున్నజనసేన పరిస్థితి చూశాం.. ఇక ఏపీలో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే.. జనసేన పరిస్థితి మళ్లీ అలాగే ఉంటుందని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. టిడిపికి ప్రతిపక్షం హోదా కోసం చంద్రబాబు జనసేనతో పొత్తుపెట్టుకున్నారని.. అలాగే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవ్వడానికే టిడిపీతో పొత్తు పెట్టుకున్నారని కొడాలి నాని ఎద్దేవా చేశారు.

పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరూ కలిసి సిఎం జగన్ వెంట్రుక కూడా పీకలేరంటూ ఘూటుగా మాట్లాడారు. వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి సింహం లాగా సింగిల్ గా వస్తారు.. కానీ చంద్రబాబు ఒక మోసగాడు ఆయన అధికారంలోకి రావడమనేది జరగదు అని ఆయన చెప్పారు.

Advertisement

సిఎం జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చారని.. ఆయనపై ప్రజలకు ఎలాంటి వ్యతిరేకత లేదని అన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి గెలిస్తే ఇక్కడ టిడిపి సంబరాలు చేసుకుంటోంది.. అదే ఓడిపోతే తమకు సంబంధం లేదని చెప్పటం టిడిపికి అలవాటని దుయ్యబట్టారు.

హైదరాబాద్‌లో ఆంధ్రా సెటిలర్స్ ఓట్లతో కేసీఆర్‌ను ఓడిస్తామని టిడిపి నేతలు చెప్పారు… కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు అయినా గెలిచిందా? అని ప్రశ్నించారు.

Advertisement

కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ పార్టీ పెట్టారు.. అలాంటి పార్టీ జెండాతో గాంధీభవన్‌ వద్ద టిడిపి వర్గాలు కాంగ్రెస్ గెలిస్తే గంతులేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్‌ ఇద్దరూ చంద్రబాబు శిష్యులే.. అలాంటిది శిష్యులు ముఖ్యమంత్రులు అవుతున్నారు కానీ చంద్రబాబు పరిస్థితి ఏంటని సెటైర్లు వేశారు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×