E-Paper
Advertisement

Pawan Kalyan : ఏపీలో మార్పు రావాలి.. జనసేనాని పిలుపు..

Pawan Kalyan : ఏపీలో మార్పు రావాలి.. జనసేనాని పిలుపు..
Advertisement
Pawan Kalyan latest speech

Pawan Kalyan latest speech(Andhra pradesh political news today):

అధికారం కోసం ఓట్లు అడగను.. మార్పు కోసం ఓట్లు అడుగుతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖపట్నం ఎంవీపీ కాలనీ ఏఎస్‌ రాజా గ్రౌండ్స్‌లో నిర్వహించిన బహిరంగ సభలో జనసేనాని పాల్గొన్నారు. ఈ సమావేశంలో నాదెండ్ల మనోహర్‌, నాగబాబు, జిల్లా పార్టీ నేతలు పాల్గొన్నారు.

పదవుల కోసం తానెప్పుడూ ఆలోచించలేదని పవన్‌ స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఉపాధి కోసం వలసలు వెళ్తున్నారని తెలిపారు. ఉత్తరాంధ్రలో వలసలు ఆగాలన్నారు. ఇక్కడే ఉపాధి అవకాశాలుండాలని వివరించారు. కష్టం వస్తే ఆదుకుంటామని చెప్పేందుకే జాలర్లను ఆదుకున్నానని చెప్పారు.

Advertisement

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశంపై పవన్ స్పందించారు. విశాఖ ఉక్కు అనేది ఆంధ్రులను ఏకతాటిపై ఉంచిన నినాదమని పేర్కొన్నారు. అన్ని జిల్లాలను ఏకం చేసిన నినాదమన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమపై తన అభిప్రాయాన్ని అమిత్‌ షా గౌరవించారని వెల్లడించారు.

విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ కాకుండా ప్రయత్నం చేయగలిగామన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశం భావోద్వేగంతో కూడినదన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర పెద్దలకు చెప్పానన్నారు. ఎప్పుడూ ఎన్నికల కోసం ఆలోచించలేదని పవన్ వివరించారు. ఒక తరం కోసం ఆలోచించానని చెప్పారు.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×