BigTV English
Advertisement

Konatala – Ashokgajapathiraju Meeting: అశోక్ గజపతిరాజుతో కొణతాల భేటీ.. కూటమిదే విజయం అంటూ..!

Konatala – Ashokgajapathiraju Meeting: అశోక్ గజపతిరాజుతో కొణతాల భేటీ.. కూటమిదే విజయం అంటూ..!

Konatala Says Kutami Will Form the Government in AP after meeting with Ashokgajapathiraju: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగియడంతో నేతలు రిలాక్స్ అవుతున్నా రు. కొందరు లాంగ్ టూర్లకు వెళ్తుండగా, మరికొందరు దేవాలయాలు సందర్శిస్తున్నారు. ఈ జాబితాలోకి అనకాపల్లి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఒకరు.


తాజాగా విజయనగరం వచ్చిన కొణతాల పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి నేరుగా టీడీపీ సీనియర్ నేత అశోక్‌గజపతిరాజుతో సమావేశమయ్యారు. ఇరువురు మధ్య దాదాపు గంటకుపైగా వివిధ అంశాలపై చర్చించుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు, ఎన్నికల ఫలితాల పరిస్థితి వంటి అంశాలపై డీప్‌గా చర్చించుకున్నారు. భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు కొణతాల రామకృష్ణ.

ఈసారి ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం ఖాయమన్నారు కొణతాల. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏ రకమైన పరిపాలన ఉండాలని కోరుకున్నారో అదే జరుగుతుందన్నారు. త్వరలో ముఖ్యమంత్రి గా చంద్రబాబు బాధ్యతలు చేపడతారన్నారు. వలసలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర కూడా ఒకటన్నారు. విద్య, ఆదాయ వనరులు తక్కువగా ఉన్న ప్రాంతమని, ఇక్కడ అభివృద్ది చేసేందుకు తమవంతు కృషి చేస్తామన్నారు. జగన్ ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారన్నారు.


Also Read: Chandrababu return from foreign tour: విదేశాల నుంచి వచ్చిన చంద్రబాబు, రేపో మాపో విజయవాడకు..

20 ఏళ్ల కిందటి ఒకసారి వెనక్కి వెళ్తే.. కొణతాల కాంగ్రెస్‌లో ఉండగా, అశోక్ గజపతిరాజు టీడీపీలో ఉన్నారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొణతాల జనసేన వైపు వచ్చారు. ఈ క్రమంలో ఆయన అనకాపల్లి నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. ఇటీవల కాలంలో టీడీపీ సీనియర్ నేతలను కలుస్తూ వస్తున్నారట కొణతాల రామకృష్ణ. మరి దీనివెనుక మర్మమేంటని చర్చించుకోవడం ఫ్యాన్ పార్టీ నేతల వంతైంది.

Tags

Related News

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Jagan Youth Politics: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్

Big Stories

×