E-Paper
Advertisement

Balakrishna Tribute to Sr. NTR: ఎన్టీఆర్‌కు బాలకృష్ణ నివాళి.. జూన్ నాలుగు తర్వాత..!

Balakrishna Tribute to Sr. NTR: ఎన్టీఆర్‌కు బాలకృష్ణ నివాళి.. జూన్ నాలుగు తర్వాత..!
Advertisement

Balakrishna Tribute to NTR Jayanthi: స్వర్గీయ నందమూరి తారకరామారావు అంటే ఓ వ్యక్తి కాదని అదొక శక్తి అని ఆయన తనయుడు, నటుడు బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ 101వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద సోదరుడు రామకృష్ణతో కలిసి నివాళులర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ సినిమాల్లో రారాజుగా ఉన్నప్పుడే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారన్నారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని కొనియాడారు. తెలుగువారికి ఆయనొక ఆరాధ్య దైవమన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆరేనని గుర్తుచేశారు.

Advertisement

ఒకప్పుడు రాజకీయాలంటే కొందరికి మాత్రమే పరిమితమై ఉండేవని, ఎన్టీఆర్ అడుగు పెట్టాక ప్రజల్లో రాజకీయ చైతన్యం వచ్చిందన్నారు బాలకృష్ణ. అధికారానికి దూరంగా ఉన్న బడుగు, బలహీన వర్గాలకు పదవులు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్‌కే చెందుతుందన్నారు. ప్రజల కోసం ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు.

Also Read: ఎన్టీఆర్‌ 101వ జయంతి.. నివాళులు అర్పించిన తారక్‌, కళ్యాణ్‌రామ్‌

Advertisement

మరోవైపు ఎన్టీఆర్ మరణించినా, ప్రజల్లో ఇంకా బ్రతికే ఉన్నారన్నారు నందమూరి లక్ష్మీపార్వతి. తెలుగు ప్రజల మనసులో స్థిరమైన స్థానం సంపాదించిన వ్యక్తి అని కొనియాడారామె. అంతకుముందు ఘాట్‌కు వచ్చిన ఆమె ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. నటుడు, రాజకీయ నాయకుడిగా ఆయన పోషించిన పాత్ర మరువలేమన్నారు. జూన్ నాలుగు తర్వాత ఏపీలో సుపరిపాలన రాబోతోందని మనసులోని మాట బయటపెట్టారు. తెలంగాణలోనూ మంచి పరిపాలన అందించాలని కోరుకున్నట్లు తెలిపారు లక్ష్మీపార్వతి.

Tags

Related News

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆరోగ్యం మాటేంటి? షాకింగ్ విషయాలు, బిగ్ టీవీతో డాక్టర్ రవిశంకర్

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Big Stories

Advertisement
×