E-Paper
Advertisement

Malaysia: కౌలాలంపూర్‌లో కుప్పం మహిళ గల్లంతు, నడుస్తుండగా..

Malaysia: కౌలాలంపూర్‌లో కుప్పం మహిళ గల్లంతు, నడుస్తుండగా..
Advertisement

Malaysia: మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో దారుణం జరిగింది. ఫుట్‌పాత్‌పై ఫ్యామిలీ సభ్యులతో కలిసి నడుస్తుండగా ఒక్కసారిగా కుంగిపోయింది. ఈ ఘటనలో ఏపీలోని కుప్పం ప్రాంతానికి చెందిన మహిళ అందులోపడిపోయింది. ఆమె ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు అధికారులు.

కుప్పంలోని అనిమిగాని‌పల్లెకు చెందిన 45 ఏళ్ల విజయలక్ష్మి ఫ్యామిలీ మలేషియాలో ఉంటుంది. చిన్నిచిన్న వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తోంది. అయితే శుక్రవారం ఉదయం విజయలక్ష్మి తన భర్త, కొడుకుతో కలిసి కౌలాలంపూర్‌లో పుట్‌పాత్‌పై నడుస్తోంది. కుటుంబ సభ్యులతో కష్టాలు చెబుతూ అడుగులు వేస్తోంది.

Advertisement

వారు వెళ్తున్న మార్గంలో పుట్‌పాత్ లోని కొంత భాగం కుంగిపోయింది. ఆమె డ్రైనేజీలో పడిపోయింది. ఆమె భర్త, కొడుకు ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న స్థానికులు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి మహిళ ఆచూకీ లభించలేదు.

ALSO READ:  తాజాగా కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Advertisement

ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎమ్మెల్సీ శ్రీకాంత్ బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ విషయాన్ని ఎమ్మెల్సీ.. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సీఎం చంద్రబాబు మలేషియా అధికారులతో మాట్లాడారు. విజయలక్ష్మి ఆచూకీ తెలపాలని సూచన చేశారు. ప్రస్తుతం అక్కడ గాలింపు చర్యలు జరుగుతున్నాయి.

 

 

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×