E-Paper
Advertisement

Malaysia: కౌలాలంపూర్‌లో కుప్పం మహిళ గల్లంతు, నడుస్తుండగా..

Malaysia: కౌలాలంపూర్‌లో కుప్పం మహిళ గల్లంతు, నడుస్తుండగా..

Malaysia: మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో దారుణం జరిగింది. ఫుట్‌పాత్‌పై ఫ్యామిలీ సభ్యులతో కలిసి నడుస్తుండగా ఒక్కసారిగా కుంగిపోయింది. ఈ ఘటనలో ఏపీలోని కుప్పం ప్రాంతానికి చెందిన మహిళ అందులోపడిపోయింది. ఆమె ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు అధికారులు.

కుప్పంలోని అనిమిగాని‌పల్లెకు చెందిన 45 ఏళ్ల విజయలక్ష్మి ఫ్యామిలీ మలేషియాలో ఉంటుంది. చిన్నిచిన్న వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తోంది. అయితే శుక్రవారం ఉదయం విజయలక్ష్మి తన భర్త, కొడుకుతో కలిసి కౌలాలంపూర్‌లో పుట్‌పాత్‌పై నడుస్తోంది. కుటుంబ సభ్యులతో కష్టాలు చెబుతూ అడుగులు వేస్తోంది.

వారు వెళ్తున్న మార్గంలో పుట్‌పాత్ లోని కొంత భాగం కుంగిపోయింది. ఆమె డ్రైనేజీలో పడిపోయింది. ఆమె భర్త, కొడుకు ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న స్థానికులు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి మహిళ ఆచూకీ లభించలేదు.

ALSO READ:  తాజాగా కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎమ్మెల్సీ శ్రీకాంత్ బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ విషయాన్ని ఎమ్మెల్సీ.. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సీఎం చంద్రబాబు మలేషియా అధికారులతో మాట్లాడారు. విజయలక్ష్మి ఆచూకీ తెలపాలని సూచన చేశారు. ప్రస్తుతం అక్కడ గాలింపు చర్యలు జరుగుతున్నాయి.

 

 

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×