E-Paper
Advertisement

Landslide in Srisailam: శ్రీశైలం‎లో భారీ వర్షం.. విరిగిపడ్డ కొండచరియలు

Landslide in Srisailam: శ్రీశైలం‎లో భారీ వర్షం.. విరిగిపడ్డ కొండచరియలు
Advertisement

శ్రీశైలం జలాశయం వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షానికి కారణంగా కొండ చరియలు విరిగి పెద్ద పెద్ద బండరాళ్లు ఘాట్‌రోడ్డులో అడ్డంగా పడ్డాయి. రహదారిపై బండరాళ్లు పడటంతో వాహనాలకు అంతరాయం ఏర్పడింది. అయితే అదృష్టవశాత్తు కొండ చరియలు విరిగిపడే సమయంలో వాహనాలు ఏవి లేకపావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రహదారిపై రాళ్లను తొందరగా తొలగించి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండాలను భక్తులు అధికారులు విజ్ఞప్తిచేశారు.

Advertisement

మరో  వైపు తెలంగాణాలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ఒకవైపు ఉక్కపోత.. మరోవైపు భారీ వర్షం.. ఇది ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు తెలంగాణవ్యాప్తంగా ఉన్న పరిస్థితి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉక్కపోత కొనసాగుతుండగా.. ఆ తర్వాత ఒక్కసారిగా వరుణుడు విరుచుకుపడుతున్నాడు. తెల్లవారుజామున ప్రారంభమై.. ఉదయం వరకు కుండపోత వాన కురుస్తోంది. దానికి తోడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురస్తుండటంతో నగరవాసులు భయాందోళన చెందుతున్నారు. నిన్న పంజాగుట్టలో అపార్ట్‌మెంట్‌పై పిడుగు పడింది. రాత్రి కురిసిన వర్షానికి ఇంకా కొన్ని కాలనీలు జలవలయంలోనే చిక్కుకున్నాయి. రోడ్లపైనే వర్షపు నీరు ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. కాగా.. వరుణుడు ఉదయం పూట కాస్త బ్రేక్ ఇచ్చినా.. ఎప్పుడు విరుచుకుపడతాడో అన్న టెన్షన్ ఉంది. అప్పటికప్పుడు ఒక్కసారిగా ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు వర్షం పడుతోంది.

Also Read: జగన్‌కు మరో భారీ షాక్.. వైసీపీ కేంద్ర ఆఫీసుకు వచ్చిన..

Advertisement

ఇక.. తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ, రేపు హైదరాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఇక రేపు, ఎల్లుండు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉరుములు, మెరుపులతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×