E-Paper
Advertisement

Vijayawada Land Slide: విజయవాడలో మరోసారి విరిగిపడిన కొండచరియలు.. ఒకరు మృతి

Vijayawada Land Slide: విజయవాడలో మరోసారి విరిగిపడిన కొండచరియలు.. ఒకరు మృతి
Advertisement

Vijayawada Land Slide: విజయవాడ మాచవరంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారమివ్వగా వారు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఆగస్టు 31న విజయవాడలో కురిసిన భారీ వర్షానికి మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందారు. ఆ తర్వాత దుర్గగుడి ఘాట్ రోడ్డు లోనూ కొండచరియలు విరిగిపడటంతో ఆ మార్గాన్ని అధికారులు మూసివేశారు. అదే రోజున కురిసిన భారీ వర్షానికి విజయవాడ విలయవాడగా మారింది. మైలవరం కొండల్లో పుట్టిన బుడమేరు.. కృష్ణానదిలో కలిసే వీలులేక ఎదురు ప్రవహించడంతో.. బెజవాడ మునిగిపోయింది. సింగ్ నగర్ తో మొదలైన వరద.. క్రమంగా చుట్టుపక్క ప్రాంతాలకు చేరింది. పీకల్లోతు నీటిలో మునిగిన బెజవాడ వాసులు.. ఇప్పటికీ కష్టపడుతున్నారు.

Advertisement

Also Read: విజయవాడ వరదలు.. టీవీ ఛానెళ్లపై సీఎం ఆగ్రహం.. జగన్ బాణం రివర్స్

కరెంట్ లేక, తిండిలేక, పిల్లలకు ఇచ్చేందుకు పాలు కూడా లేక ఆకలి కేకలు పెట్టారు. ఆహారాన్ని పంచేందుకు హెలికాఫ్టర్లు, డ్రోన్లతో పాటు ట్రాక్టర్లు, బోట్లను వినియోగించారు. వీలైనంత మేర ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు బెజవాడ వరద బాధితులకు ఆహారాలను అందించాయి. వరదనీరు తగ్గినా.. దానివల్ల వచ్చిన బురదతో ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నారు. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. అందరికీ మందులు అందజేసింది.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×