BigTV English

Tirumala: తిరుమలలో మళ్లీ చిరుత కలకలం.. అలిపిరి వద్ద గుర్తించిన టీటీడీ ఉద్యోగి

Tirumala: తిరుమలలో మళ్లీ చిరుత కలకలం.. అలిపిరి వద్ద గుర్తించిన టీటీడీ ఉద్యోగి

తిరుమలలో మళ్లీ చిరుత కలకలం
అలిపిరి వద్ద గుర్తించిన టీటీడీ ఉద్యోగి
ఒక్కసారిగా ఆందోళన.. బైక్ ప్రమాదానికి గురవ్వడంతో గాయాలు
చిరుత సంచారంపై భక్తులను అప్రమత్తం చేసిన అధికారులు


తిరుమల, స్వేచ్ఛ: శ్రీవారి పుణ్యక్షేత్రం తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేగింది. అలిపిరి వద్ద శనివారం ఒక చిరుత కనిపించింది. బైక్‌పై వెళుతున్న టీటీడీ ఉద్యోగి కంటపడింది. అయితే, చిరుత చూసిన సదరు ఉద్యోగి తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో బైక్‌పై నియంత్రణ కోల్పోయాడు. దీంతో, బైక్ వెళ్లి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో విజయ్ కుమార్ అనే టీటీడీ ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి. అధికారులకు సమాచారం అందగానే బాధిత వ్యక్తిని అంబులెన్స్ ద్వారా ఘటనా స్థలం నుంచి హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆ ఉద్యోగి చికిత్స పొందుతున్నాడు.

కాగా, చిరుత సంచరిస్తున్న విషయాన్ని టీటీడీ అధికారులు భక్తులకు తెలియజేశారు. జాగ్రత్తగా ఉండాలంటూ అప్రమత్తం చేశారు. అలిపిరి సమీపంలో చిరుత సంచరిస్తోందని, తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులకు కూడా టీటీడీ అధికారులు సమాచారం చేరవేశారు. అటవీశాఖ అధికారులు కూడా తక్షణమే రంగంలోకి దిగి చిరుత జాడ కోసం గాలింపు మొదలుపెట్టారు. చిరుతను పట్టుకోవాలని అధికారులు భావిస్తున్నారు. బోన్ ఏర్పాటు చేశారు. అంతేకాదు, చిరుత జాడను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు.


రాష్ట్రంలో చిరుతల కలకలం
రాష్ట్రంలో ఈ మధ్య వరుసగా చిరుతల కలకలం రేపుతున్నాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మునిసిపాలిటీలోని ముదిగల్లు గ్రామంలో శుక్రవారం ఓ చిరుత కలకలం రేపింది. గ్రామ సమీపంలోని ఓ కొండపై తిష్ట వేసి రాత్రి సమయాల్లో గ్రామంలోని ఇళ్ల సమీపంలో చక్కర్లు కొడుతోంది. దీంతో, గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించినా పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

Also Read: సంక్రాంతి వరాలు ప్రకటించిన ప్రభుత్వం..పెండింగ్ బకాయిలు విడుదల

ఇప్పటికే పలువురు అధికారులకు సమాచారం ఇచ్చామని, కనీసం ఒక్కసారి కూడా గ్రామం వైపు అటవీశాఖ అధికారులు రాలేదని అంటున్నారు. పగలు, రాత్రి సమయంలో పెంపుడు జంతువులపై చిరుత గ్రామంలోకి ప్రవేశించి దాడులకు తెగబడుతోందని వారు వాపోతున్నారు. అంతకుముందు, శ్రీశైలంలోని పాతాళ గంగ సమీపంలో చిరుత ఒకరి ఇంట్లోకి ప్రవేశించింది. సీసీ కెమెరాల్లో కూడా ఈ దృశ్యాలు నమోదైన విషయం తెలిసిందే. అంతకుముందు నంద్యాల జిల్లా మహానంది సమీపంలో కూడా ఒక చిరుత పులి సంచరించింది.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×