BigTV English
Advertisement

Anantapur Road Accident : కారును ఢీ కొట్టిన లారీ.. నలుగురు స్పాట్ డెడ్

Anantapur Road Accident : కారును ఢీ కొట్టిన లారీ.. నలుగురు స్పాట్ డెడ్

Road accident in anantapur today(AP news live):

అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లి సమీపంలో ఉన్న 44వ జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టిన కారును.. అటుగా వచ్చిన లారీ ఢీ కొనడంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు.


ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయ. అనంతపురంలోని సంగమేశ్వర్ నగర్ కు చెందిన ఏడుగురు హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి కారులో బయల్దేరారు. గుత్తికి 4 కిలోమీటర్ల ఆవల ఉన్నరాయల్ దాబా వద్ద కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. అదే సమయంలో అనంతపురం నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న లారీ కారును ఢీ కొట్టింది.

ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మృతుల్లో పదేళ్ల వయసుగల చిన్నారులు స్పాట్ లోనే మరణించారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో ముగ్గురికి గాయాలవ్వగా వారు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఘటనపై గుత్తి సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


 

Tags

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×