E-Paper
Advertisement

Anantapur Road Accident : కారును ఢీ కొట్టిన లారీ.. నలుగురు స్పాట్ డెడ్

Anantapur Road Accident : కారును ఢీ కొట్టిన లారీ.. నలుగురు స్పాట్ డెడ్

Road accident in anantapur today(AP news live):

అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లి సమీపంలో ఉన్న 44వ జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టిన కారును.. అటుగా వచ్చిన లారీ ఢీ కొనడంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు.

ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయ. అనంతపురంలోని సంగమేశ్వర్ నగర్ కు చెందిన ఏడుగురు హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి కారులో బయల్దేరారు. గుత్తికి 4 కిలోమీటర్ల ఆవల ఉన్నరాయల్ దాబా వద్ద కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. అదే సమయంలో అనంతపురం నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న లారీ కారును ఢీ కొట్టింది.

ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మృతుల్లో పదేళ్ల వయసుగల చిన్నారులు స్పాట్ లోనే మరణించారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో ముగ్గురికి గాయాలవ్వగా వారు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఘటనపై గుత్తి సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Tags

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×