E-Paper
Advertisement

Madhuri Challenge : “దమ్ముంటే డీఎన్ఏ టెస్ట్ చేయించు”.. దువ్వాడ వాణికి మాధురి సవాల్

Madhuri Challenge : “దమ్ముంటే డీఎన్ఏ టెస్ట్ చేయించు”.. దువ్వాడ వాణికి మాధురి సవాల్
Advertisement

Madhuri Challenge to Duvvada Vani: దువ్వాడ శ్రీనివాస్ – వాణి – మాధురి వ్యవహారం ముదురుతోంది. శ్రీనివాస్ తో కలిసి ఉండే హక్కు తమకే ఉందని వాణి, కూతురు హైందవి అంటుండగా.. వాణి.. శ్రీనివాస్ ను టార్చర్ పెట్టిందని ఆరోపించింది మాధురి. తన పిల్లల గురించి మాట్లాడే హక్కు వాణికి లేదంటూనే సవాల్ చేసింది. వాణి తన పిల్లలిద్దరికీ డీఎన్ఏ టెస్టులు చేయించాలని, తను కూడా డీఎన్ఏ టెస్టులు చేయిస్తానని ఛాలెంజ్ చేసింది.

తను టెక్కలికి చెందిన మహిళనేనని, ఈ ప్రాంతాన్ని వదిలి ఎక్కడికి వెళ్లబోనని, తనను తరిమేయడానికి వాణికి ఏం హక్కులున్నాయని మీడియా ముఖంగా ప్రశ్నించింది మాధురి. శ్రీనివాస్ కు తనకు మధ్యనున్నది హెల్దీ రిలేషన్ షిప్ అని చెప్పింది. దానిని లివ్ ఇన్ అనుకుంటారో, అడల్ట్రీ అనుకుంటారో మీ ఇష్టానికే వదిలేస్తున్నా అని మీడియాకు స్పష్టం చేసింది.

Advertisement

దువ్వాడ శ్రీనివాస్ 60 ఏళ్ల వయసులో 30 ఏళ్లు కాపురం చేసిన భార్యను వదిలి వచ్చారంటే.. ఆమె ఎంత టార్చర్ పెట్టి ఉంటుందో అర్థం చేసుకోవాలని నీతులు చెప్పారు. భోజనంలో పాయిజన్ కలిపి పెట్టడం, ఆయన ముఖంపై తలగడ పెట్టి ఒత్తడం వంటివి చేసిందని, డంబెల్స్ పెట్టి కొట్టినట్లు కూడా ఆయన ఇంటిలో పనిచేసిన కుర్రాడు చెప్పాడని వాపోయింది.

Also Read: లోగుట్టు బయటపెట్టిన దువ్వాడ శ్రీను, జగన్‌.. బ్లాక్ మెయిల్ చేసింది వాణి

Advertisement

రెండు నెలల క్రితం ఎలక్షన్లో, గడపగడపకు కార్యక్రమంలో సహాయం చేసేందుకు ఆయన వద్దకు వెళ్లానని, అప్పట్నుంచీ అక్కడే ఉంటున్నట్లు చెప్పుకొచ్చింది మాధురి. దువ్వాడ శ్రీనివాస్ ఇల్లు కట్టుకునేందుకు రూ.2 కోట్లు అప్పు ఇచ్చానని, ఆ అప్పు తీరేంతవరకూ ఆ ఇంటిలోనే ఉంటానని భీష్మించింది. తామిద్దరి మధ్య ఈ మేరకు అగ్రిమెంట్ జరిగిందని తెలిపింది.

దువ్వాడ వాణికి మెంటల్ డిజార్డర్ ఉందని, ఆమెకు మెడికల్ టెస్టులు చేయించి పిచ్చాసుపత్రికి పంపాలని చెప్పింది మాధురి. వాణికి పోటీగా రేపు ఉదయం నుంచి తాను కూడా టెక్కలి వెళ్లి దీక్ష చేస్తానని చెప్పింది. వాణి వచ్చి క్షణాపణ చెబితేనే తాను దీక్ష విరమిస్తానని తెలిపింది. మరి ఈ నారీ నారీ నడుమ మురారి వ్యవహారం ఎంతవరకూ వెళ్తుందో.. ఎక్కడ తెగుతుందో చూడాలి.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×