E-Paper
Advertisement

Prakasam Crime: మార్కాపురంలో దారుణం.. నిద్రిస్తున్న వ్యక్తిని నరికి చంపిన వైనం.. అడ్డొచ్చిన భార్యపై..?

Prakasam Crime: మార్కాపురంలో దారుణం.. నిద్రిస్తున్న వ్యక్తిని నరికి చంపిన వైనం.. అడ్డొచ్చిన భార్యపై..?
Advertisement

Murder in Prakasam District: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో దారుణం చోటుచేసుకుంది. నికరంపల్లికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇంట్లో నిద్రిస్తుండగా నరికి చంపారు. వెంకటేశ్వర్లు ఇంట్లో నిద్రిస్తుండగా.. ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడిన కాశీరామిరెడ్డి అనే యువకుడు.. గొడలితో దాడి చేశాడు. భర్త వెంకటేశ్వర్లుపై దాడిని చూసి అడ్డు వచ్చిన అతని భార్య తిరుపతమ్మపై కూడా అదే గొడ్డలితో దాడి చేశాడు. ఆమె చేతిని నరికేశాడు. కాశీరామిరెడ్డి దాడిలో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. అతని భార్య తిరుపతమ్మ తీవ్రంగా గాయపడింది.

Read More: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Advertisement

స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. తీవ్రగాయాలతో రక్తపు మడుగులో పడివున్న తిరుపతమ్మను గుంటూరు ఆస్పత్రికి తరలించారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. వెంకటేశ్వర్లు హత్య అనంతరం.. నిందితుడు కాశీరామిరెడ్డి పరారయ్యాడని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

Related News

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

Big Stories

Advertisement
×