E-Paper
Advertisement

Posani: పోసానికి మరిన్ని కష్టాలు.. రాజంపేట నుంచి నరసరావుపేట

Posani: పోసానికి మరిన్ని కష్టాలు.. రాజంపేట నుంచి నరసరావుపేట
Advertisement

Posani: వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళికు కష్టాలు రెట్టింపు అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆయనపై 17 కేసులు నమోదు అయినట్టు తెలుస్తోంది. ఆయా స్టేషన్లకు సంబంధించిన పోలీసులు పీటీ వారెంట్లు రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం మూడు జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు రాజంపేట జైలు అధికారులకు పీటీ వారెంట్లు అందించారు. వాటిలో గుంటూరు జిల్లా నరసరావుపేట, అల్లూరి జిల్లా, అనంతపురం గ్రామీణ పోలీసులు జైలు అధికారికి వారెంట్లు అందజేశారు.

ఇదిలాఉండగా నరసారావుపేట స్టేషన్‌లో పోసానిపై కేసు నమోదు అయ్యింది. పీటీ వారెంట్‌‌తో రాజంపేట సబ్‌ జైలుకు నరసరావుపేట పోలీసులు చేరుకున్నారు. రాజంపేట సబ్‌ జైల్లో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత పోసానిని అదుపులోకి తీసుకున్నారు. రాజంపేట నుంచి నరసరావుపేటకు ఆయన్ని తరలిస్తున్నారు.

Advertisement

సోమవారం మధ్యాహ్నం నరసరావుపేట కోర్టులో పోసానిని హాజరు పరిచనున్నారు పోలీసులు. కోర్టులో హాజరు పరిచిన తర్వాత న్యాయస్థానం నిర్ణయం మేరకు నరసారావుపేట సబ్ జైలులో ఉంచుతారా? రాజంపేటకు తరలిస్తారా అనేది చూడాలి. నాలుగు రోజులుగా పోసాని రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.

గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ సహా పలువురు నేతలపై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేశారు పోసాని. గతవారం పోసాని కృష్ణ మురళిని హైదరాబాద్‌లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. తన వ్యాఖ్యల ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీలో విభేదాలు సృష్టించారంటూ ఆయనపై జనసేన నేత జోగినేని మణి ఇచ్చిన ఫిర్యాదుపై ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో కేసు రిజిస్టర్ అయిన విషయం తెల్సిందే.

Advertisement

 

 

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×