E-Paper
Advertisement

Rain Alert: వదలని వర్షాలు.. మళ్లీ భారీ వర్ష సూచన..

Rain Alert: వదలని వర్షాలు.. మళ్లీ భారీ వర్ష సూచన..
Advertisement

Rain Alert: అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీనితో పలు జిల్లాలలో మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సైతం ప్రకటన విడుదల చేసింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే అధికారులు సైతం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.

ఇటీవల ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటికి మొన్న రాయలసీమ ప్రాంతంలో మోస్తారు నుండి భారీ వర్షాలు కురవగా, స్థానిక జలాశయాలు జలకళ ను సంతరించుకున్నాయి. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాలు సైతం నీట మునగగా, అధికారులు తీసుకున్న చర్యలతో ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదు. ఆ తర్వాత చెన్నైలో భారీ వర్షాలు కురిసాయి. ఇక ఏపీకి వర్ష సూచన ఉండదని భావిస్తున్న తరుణంలో తాజాగా వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచన చేసింది.

Advertisement

అల్పపీడనం ప్రభావంతో మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.

Also Read: Tollywood Actors: ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి.. టాలీవుడ్ హీరోలకు క్లాస్

Advertisement

అంతేకాకుండా రాష్ట్రంలోని వైయస్సార్ కడప జిల్లా, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో సైతం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సైతం కోరింది. ప్రధానంగా వ్యవసాయ మోటార్లకు వద్దకు వెళ్లే రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఉరుములు మెరుపుల సమయంలో ప్రజలు ఇంటిపట్టునే ఉండడం మంచిదని ప్రభుత్వం సూచించింది.

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×