E-Paper
Advertisement

Tollywood Actors: ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి.. టాలీవుడ్ హీరోలకు క్లాస్

Tollywood Actors: ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి.. టాలీవుడ్ హీరోలకు క్లాస్
Advertisement

Tollywood Actors: పుష్ప 2 సినిమా రికార్డులు బద్దలు కొట్టడం ఏమో కానీ, సినిమా రిలీజ్ రోజు జరిగిన ఒక్క ఘటనతో టాలీవుడ్ కి ఆ సెగతాకుతోంది. సంధ్య థియేటర్ వద్దకు హీరో అల్లు అర్జున్ రావడంతో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందగా, ఆమె కుమారుడు శ్రీ తేజ్ వైద్యశాలలో చికిత్స పొందుతూ, ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకుంటున్నాడు. ఈ దుర్ఘటనకు అసలు కారకుడు హీరో అల్లు అర్జున్ అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, టాలీవుడ్ హీరోలను ఉద్దేశించి కీలక కామెంట్స్ చేశారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గొప్పోల్లమని విర్రవీగే సినిమా హీరోలు, ఏనాడైనా గ్రామాలను వైద్యశాలలను దత్తత తీసుకొని కార్యక్రమాలు చేశారా అంటూ సూటిగా ప్రశ్నించారు. గతంలో సీనియర్ నటులు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణంరాజులు దివిసీమ ఉప్పెన సమయంలో జోల పట్టి విరాళాలు సేకరించారని ఈ సందర్భంగా వారి సేవను కొనియాడారు. అటువంటి మహానటులకు వారసులుగా వచ్చిన, ఇప్పటి కాలం హీరోలు ఏనాడైనా పేద ప్రజలకు సహాయపడిన దాఖలాలు లేవన్నారు.

Advertisement

ఖరీదైన వాచీలు, కార్లు వినియోగిస్తూ విదేశీ ట్రిప్పులతో నిరంతరం వార్తలో నిలవడం నేటితరం హీరోలకు అలవాటుగా మారిందని విమర్శించారు. తమిళ సినీ నటులకు ఉన్న సామాజిక స్పృహ కూడా తెలుగు నటులకు ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ కోసం ఎందరో యువకులు బలిదానం చేసుకున్న రోజుల్లో, ఈ హీరోలంతా ఏమయ్యారని ఎమ్మెల్యే అన్నారు.

మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని, మంచు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి పలు పాఠశాలలను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నారన్నారు. నేటితరం హీరోలకు మాత్రం సేవా కార్యక్రమాలు అస్సలు పట్టడం లేదంటూ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ప్రస్తుత హీరోల కంటే విలన్ పాత్రలు పోషించే సోను సూద్ సేవా కార్యక్రమాలు నిర్వహించి, తన సేవా తత్పరతను చాటి చెప్పారని కొనియాడారు. హీరోయిన్ సమంత కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, సమంతపై ప్రశంసల వర్షం కురిపించారు ఎమ్మెల్యే.

Advertisement

Also Read: Deepa Dasmunsi: అల్లు అర్జున్ మామతో భేటీకి నో చెప్పిన మున్షీ.. కారణం అదేనా!

ప్రజా వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా ప్రస్తుత హీరోలు మారాలని, నైజాం ఏరియా సినిమాలు చూడకుంటే అడుక్కొని తినడం ఖాయం అంటూ ఎమ్మెల్యే చెప్పారు. తెలంగాణకు చెందిన ఎంతమందికి ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాలు ఇచ్చారో చెప్పాలంటూ టాలీవుడ్ ను ఆయన ప్రశ్నించారు. మరి ఎమ్మెల్యే మాటలకు టాలీవుడ్ నుండి సమాధానం వస్తుందా, లేక సైలెంట్ గా ఉంటారా అన్నది తేలాల్సి ఉంది

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×