E-Paper
Advertisement

Anagani Satya Prasad: భూముల అక్రమాలు నిజమే, గుండెల్లో టెన్షన్ ఖాయం-మంత్రి అనగాని

Anagani Satya Prasad: భూముల అక్రమాలు నిజమే, గుండెల్లో టెన్షన్ ఖాయం-మంత్రి అనగాని
Advertisement

Anagani Satya Prasad: ఏపీలో భూ అక్రమాలపై లోతుగా దర్యాప్తు జరుగుతోందన్నారు రెవిన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్. మదనపల్లెలో 13 వేల ఎకరాల భూములను ఫ్రీహోల్డ్ చేసినట్టు తెలిపారు. ఇందులో అధికారులు, ప్రజాప్రతినిధులపై శిక్ష పడడం ఖాయమన్నారు.

మండలి సమావేశాల్లో భాగంగా శుక్రవారం భూముల వ్యవహారంపై సభ్యులు పలు ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై మంత్రి అనగాని సత్యప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో 13.59 లక్షల ఎకరాల భూములు ఫ్రీ హోల్డ్ చేసినట్టు తేలిందన్నారు. ఏమైనా తప్పులు జరిగాయా అనేదానిపై విచారణ చేపట్టామన్నారు.

Advertisement

గత ప్రభుత్వంలో 25 వేల ఎకరాలు అమ్మకాలు జరిగాయన్నారు. నిబంధనలకు విరుద్దంగా 7837 ఎకరాల భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయని తేల్చారు. గడిచిన ఐదునెలలుగా 70 వేలకు పైగానే ఫిర్యాదు వచ్చాయన్నారు. అందులో ల్యాండ్ గ్రాబింగ్‌కు సంబంధించి 8305 వేలు ఫిర్యాదులు ఉన్నాయన్నారు.

అసైన్డ్ భూములను ఫ్రీహోల్డ్ చేసేందుకు 22 ఏ నుంచి తొలగించేందుకు గత ప్రభుత్వం జీవో తెచ్చిందన్నారు మంత్రి అనగాని. భూ కబ్జాలను అరికట్టేందుకు కూటమి సర్కార్ కొత్తగా ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తీసుకొచ్చామన్నారు.

Advertisement

ALSO READ: ప‌రారీలో వైసీపీ నేత గౌత‌మ్ రెడ్డి.. ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్న‌ అరాచకాలు

ఈ చట్టం ద్వారా అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టడం ఖాయమని చెప్పారు మంత్రి అనగాని సత్యప్రసాద్. భూకబ్జాలకు పాల్పడినవారికి 10 నుంచి 14 ఏళ్ల వరకు జైలు శిక్షలు పడేలా చట్టంలో ఉందన్నారు. దీనికి సంబందించిన బిల్లు రేపో మాపో మండలికి వస్తుందన్నారు.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×