E-Paper
Advertisement

Ycp leader Goutham Reddy: ప‌రారీలో వైసీపీ నేత గౌత‌మ్ రెడ్డి.. ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్న‌ అరాచకాలు

Ycp leader Goutham Reddy: ప‌రారీలో వైసీపీ నేత గౌత‌మ్ రెడ్డి.. ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్న‌ అరాచకాలు
Advertisement

Ycp leader Goutham Reddy:  విజ‌య‌వాడ‌లో భూక‌బ్జా వ్య‌వ‌హారంలో వైసీపీ నేత గౌతమ్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఉమామ‌హేశ్వ‌రరావు అనే వ్య‌క్తి త‌న‌కు చెందిన స్థ‌లాన్ని గౌత‌మ్ రెడ్డి క‌బ్జా చేసి బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నాడ‌ని ఆరోపించాడు. బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్న వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ క్ర‌మంలో వీడియోలు బ‌య‌ట‌కు రావ‌డం వ‌ల్ల త‌న ప‌రువు పోతుంద‌ని ఉమా మ‌హేశ్వ‌ర‌రావుపై గౌతమ్ రెడ్డి సుపారీ గ్యాంగ్ కు డ‌బ్బులు ఇచ్చి దాడి చేయించాడు. రూ.24 ల‌క్ష‌లు సుపారీ గ్యాంగ్ కు ఇచ్చి య‌జ‌మాని కాళ్లు చేతులు విరిచేయాల‌ని చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

దీంతో ఉమామ‌హేశ్వ‌ర రావు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న కోసం పోలీసులు గాలిస్తుండగా ప‌రారీలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో గౌత‌మ్ రెడ్డి గురించి మీడియా స‌మావేశంలో సీపీ సంచ‌లన నిజాలు బ‌య‌ట‌పెట్టారు. గౌత‌మ్ రెడ్డిపై గ‌తంలోనే 42 కేసులు ఉన్న‌ట్టు తెలిపారు. 1998 నుండి గౌత‌మ్ రెడ్డి భూక‌బ్జాల‌కు పాల్ప‌డ‌టం, ఇత‌ర దందాలు చేస్తున్న‌ట్టు చెప్పారు. ఇప్ప‌టికే ఆయ‌నపై రౌడీ షీట్ కూడా న‌మోదు చేసిన‌ట్టు వెల్ల‌డించారు.

Advertisement

దీపావ‌ళి పండుగ రోజున ఉమామ‌హేశ్వ‌ర రావు ఇంటిపైకి గౌత‌మ్ రెడ్డి మ‌నుషుల‌ను పంపించిన‌ట్టు చెప్పారు. కేసుల‌ను వెన‌క్కి తీసుకోక‌పోతే చంపేస్తామ‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డిన‌ట్టు తెలిపారు. ప్ర‌స్తుతం గౌత‌మ్ రెడ్డి ప‌రారీలో ఉన్నార‌ని ఆయ‌న కోసం రెండు బృంధాలు గాలిస్తున్నాయ‌ని అన్నారు. గౌత‌మ్ రెడ్డి సుపారీ ఇచ్చిన గ్యాంగ్ స‌భ్యులు న‌లుగురిని అదుపులోకి తీసుకున్నామ‌ని చెప్పారు. గౌత‌మ్ రెడ్డి గ్యాంగ్ కు సుపారీ ఇచ్చిన‌ట్టు వీడియో రికార్డు అయింద‌ని ఆ వీడియో ఆధారంగా విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని చెప్పారు.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×