E-Paper
Advertisement

Ycp leader Goutham Reddy: ప‌రారీలో వైసీపీ నేత గౌత‌మ్ రెడ్డి.. ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్న‌ అరాచకాలు

Ycp leader Goutham Reddy: ప‌రారీలో వైసీపీ నేత గౌత‌మ్ రెడ్డి.. ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్న‌ అరాచకాలు
Advertisement

Ycp leader Goutham Reddy:  విజ‌య‌వాడ‌లో భూక‌బ్జా వ్య‌వ‌హారంలో వైసీపీ నేత గౌతమ్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఉమామ‌హేశ్వ‌రరావు అనే వ్య‌క్తి త‌న‌కు చెందిన స్థ‌లాన్ని గౌత‌మ్ రెడ్డి క‌బ్జా చేసి బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నాడ‌ని ఆరోపించాడు. బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్న వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ క్ర‌మంలో వీడియోలు బ‌య‌ట‌కు రావ‌డం వ‌ల్ల త‌న ప‌రువు పోతుంద‌ని ఉమా మ‌హేశ్వ‌ర‌రావుపై గౌతమ్ రెడ్డి సుపారీ గ్యాంగ్ కు డ‌బ్బులు ఇచ్చి దాడి చేయించాడు. రూ.24 ల‌క్ష‌లు సుపారీ గ్యాంగ్ కు ఇచ్చి య‌జ‌మాని కాళ్లు చేతులు విరిచేయాల‌ని చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

దీంతో ఉమామ‌హేశ్వ‌ర రావు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న కోసం పోలీసులు గాలిస్తుండగా ప‌రారీలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో గౌత‌మ్ రెడ్డి గురించి మీడియా స‌మావేశంలో సీపీ సంచ‌లన నిజాలు బ‌య‌ట‌పెట్టారు. గౌత‌మ్ రెడ్డిపై గ‌తంలోనే 42 కేసులు ఉన్న‌ట్టు తెలిపారు. 1998 నుండి గౌత‌మ్ రెడ్డి భూక‌బ్జాల‌కు పాల్ప‌డ‌టం, ఇత‌ర దందాలు చేస్తున్న‌ట్టు చెప్పారు. ఇప్ప‌టికే ఆయ‌నపై రౌడీ షీట్ కూడా న‌మోదు చేసిన‌ట్టు వెల్ల‌డించారు.

Advertisement

దీపావ‌ళి పండుగ రోజున ఉమామ‌హేశ్వ‌ర రావు ఇంటిపైకి గౌత‌మ్ రెడ్డి మ‌నుషుల‌ను పంపించిన‌ట్టు చెప్పారు. కేసుల‌ను వెన‌క్కి తీసుకోక‌పోతే చంపేస్తామ‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డిన‌ట్టు తెలిపారు. ప్ర‌స్తుతం గౌత‌మ్ రెడ్డి ప‌రారీలో ఉన్నార‌ని ఆయ‌న కోసం రెండు బృంధాలు గాలిస్తున్నాయ‌ని అన్నారు. గౌత‌మ్ రెడ్డి సుపారీ ఇచ్చిన గ్యాంగ్ స‌భ్యులు న‌లుగురిని అదుపులోకి తీసుకున్నామ‌ని చెప్పారు. గౌత‌మ్ రెడ్డి గ్యాంగ్ కు సుపారీ ఇచ్చిన‌ట్టు వీడియో రికార్డు అయింద‌ని ఆ వీడియో ఆధారంగా విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని చెప్పారు.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×