BigTV English

Minister Anam comments on Jagan: జగన్‌పై మంత్రి ఆనం ఫైర్, ఆరు అడుగులు.. ఆ నలుగురు కోసమే..

Minister Anam comments on Jagan: జగన్‌పై మంత్రి ఆనం ఫైర్, ఆరు అడుగులు.. ఆ నలుగురు కోసమే..

Minister Anam comments on Jagan: వైసీపీ అధినేత, మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే జగన్‌పై తొలిసారి ఫైర్ అయ్యారు మంత్రి ఆనం రామనారాయణ‌రెడ్డి. ఉండేది ఇద్దరు పిల్లలని, నాలుగైదు ప్యాలెస్‌ లు ఉన్నాయని, ఇంకా దోపిడీ ఎవరి కోసమన్నారు. చివరకు ఏం సాధించావని ప్రశ్నించారు. జీవిత చివర లో మనకు కావాల్సింది ఆరు అడుగుల స్థలం, నలుగురు ఆప్తులు ఉంటే సరిపోతుందన్నారు. కనీసం జగన్ ఫ్యామిలీలో నలుగురు కుటుంబసభ్యులు కూడా లేరన్నారు.


నెల్లూరులో గురువారం ఉదయం మీడియాతో మాట్లాడారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. దేవాదాయశాఖలో జగన్ సర్కార్ ఎలాంటి దోపిడీ చేసిందో తెలీదుగానీ, తొలిసారి పర్సనల్‌గా ఎటాక్ చేశారు. తాను ప్యాలెస్‌ టు ప్యాలెస్‌కు వెళ్తున్నారని మీడియాకు లీక్‌లిస్తే అందులో ఏమంటుందన్నారు. సొంత ప్యాలెస్‌లకు వెళ్తున్నావని, ప్యాలెస్ నుంచి పూరి గుడిసెకు వస్తే చెప్పుకోవచ్చారు.

ఒక ప్యాలెస్‌కు వెళ్లాలని ప్లాన్ చేశావని, ఆ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టం వల్ల వెళ్లలేక పోయావన్నారు దేవాదాయశాఖ మంత్రి. సింహాచలం లక్ష్మీనరసింహాస్వామి వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. ఏపీలో ఇవాళ ఉన్న పరిస్థితి వల్ల తాడేపల్లి ప్యాలెస్‌కు రావని రాజకీయ విశ్లేషకుల ఆలోచనగా చెప్పుకొచ్చారు.


పనిలోపనిగా ట్విట్ట‌ర్ తాత‌య్య విజయసాయిరెడ్డి గురించి నోరువిప్పారు మంత్రి ఆనం. గతేడాది మే నెలలో శాంతి పెట్టిన ట్వీట్‌ గురించి ప్రస్తావించారు. వారికి సంబంధించినది ప్రైవేటు కార్యక్రమంగానే ఉందన్నారు. విశాఖలో విజయసాయిరెడ్డి చేసిన ప్రతీ రెవెన్యూ దందా వెనుక సుభాష్‌రెడ్డి, శాంతి ప్రమేయం ఉందని చెప్పకనే చెప్పారు.

ALSO READ: వైసీపీ కార్యకర్త దారుణ హత్య..మాజీ సీఎం జగన్ ఏమన్నారంటే?

మూడేళ్లుగా దేవాదాయశాఖ భూములను అమ్ముకోవడానికి ఎవరి ప్రమేయంతో పర్మీషన్ ఇచ్చారని ప్రశ్నించారు. ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశామని, మా డిపార్ట్‌మెంటును రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Tags

Related News

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

AP Rains: ఏపీ వాసులకు అలర్ట్.. రాగల 3 గంటల్లో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

GST Official Suspended: సోషల్ మీడియా పోస్ట్ తో ఉద్యోగం ఊడింది.. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు

Prakasam District: గిద్దలూరులో విషాదం.. బాత్రూంలో డెలివరీ.. బకెట్లో శిశువును పడేసి.. పరారైన తల్లి

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Big Stories

×