E-Paper
Advertisement

Roja: పవన్ ఇల్లు కొండమీద లేదా? కోర్టు కంటే గొప్పోడా?.. రోజా స్ట్రాంగ్ కౌంటర్..

Roja: పవన్ ఇల్లు కొండమీద లేదా? కోర్టు కంటే గొప్పోడా?.. రోజా స్ట్రాంగ్ కౌంటర్..
Advertisement

Roja: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మరోసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి రోజా. పవన్‌ విశాఖ పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చేశారు. రుషికొండపై పవన్ కల్యాణ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖను పాలనారాజధానిగా ఎంచుకున్నందుకే పవన్ కల్యాణ్, చంద్రబాబు విషం కక్కు తున్నారంటూ ఫైర్ అయ్యారు.

రుషికొండపై నిర్మాణాలకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని.. హైకోర్టు నిబంధనలకు లోబడి నిర్మాణాలు జరుగుతున్నాయని మంత్రి రోజా క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ భూముల్లో భవనాలు నిర్మిస్తుంటే పవన్‌కు ఎందుకు బాధ కలుగుతుందని.. కోర్టుల కంటే పవన్‌ గొప్పోడా? అని ప్రశ్నించారు.

Advertisement

కొండలపై ఏం కట్టొద్దని పవన్ కల్యాణ్‌ అజ్ఞానంగా మాట్లాడుతున్నారని.. అలాంటప్పుడు చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ల‌ ఇళ్లు బంజారాహిల్స్‌లో కొండల మీద ఉన్నాయి కదా అని నిలదీశారు రోజా. బోడి వెధవలు, బోడి ప్రచారం చేయడం ఫ్యాషన్‌గా మారిపోయిందని మండిపడ్డారు. సీఎం జగన్‌కు ఏపీలో ముందునుంచే ఇల్లు ఉందని.. అయినా ఆయనకు ఎన్ని ఇళ్లు ఉంటే పవన్‌కు ఎందుకన్నారు రోజా.

పవన్‌ చంద్రబాబుకు బానిసని.. బాబు ఇచ్చే ప్యాకేజీ కోసం పని చేస్తుంటాడని.. ఆ ఇద్దరికీ ఏపీలో కనీసం ఇల్లు కూడా లేదంటూ రోజా కౌంటర్లు వేశారు. నిలదీయాలనుకుంటే చంద్రబాబు అవినీతి గురించి నిలదీయాలని..
కరకట్ట అక్రమ నిర్మాణం, గీతం వర్సిటీ కబ్జాల గురంచి ప్రశ్నించాలని పవన్‌ను సవాల్ చేశారు మంత్రి రోజా. పవర్‌స్టార్‌ కాదు.. ప్యాకేజీ స్టార్‌.. పవన్ కల్యాణా.. పనికిమాలిన కళ్యాణా.. అంటూ ఫైర్ అయ్యారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×