Delhi Politics: ఏపీలో రాజకీయాల్లో ఏం జరుగుతోంది? సడన్గా మంత్రి లోకేష్ హస్తిన టూర్ వెనుక జరిగిన.. జరుగుతున్న పరిణామాలేంటి? పార్లమెంటు సెషన్ జరుగుతుందని వెళ్లారా? కేవలం నిధులు రాబట్టుకోవడం కోసమేనా? లేకుంటే ప్రత్యర్థుల చిట్టా బయటపెట్టేందుకు వెళ్లారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
ఢిల్లీలో మంత్రి లోకేష్.. కేంద్రమంత్రులతో భేటీ
ఢిల్లీలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. ఈసారి సమావేశాలకు తక్కువ సమయంలో అంటే కేవలం 15 రోజులు మాత్రమే జరగనున్నాయి. సమావేశాలకు మంత్రులు అందరూ రానుండడంతో ఏపీ ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. ఈ క్రమంలో మంత్రలు లోకేష్, అనిత ఢిల్లీకి వెళ్లారు. సోమవారం రాత్రి విజయవాడ నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లారు.
అక్కడి ఎయిర్పోర్టులో టీడీపీ ఎంపీలు మంత్రి లోకేష్ని కలిశారు. అక్కడి నుంచి నేరుగా టీడీపీ ఆఫీసుకు వెళ్లారు. టీడీపీకి చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలతో దాదాపు గంటపాటు చర్చించారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని ఉన్నారు. అలాగే ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సానా సతీష్, కేశినేని శివనాథ్, అప్పల నాయుడు, నాగరాజు, భరత్, లావు కృష్ణదేవరాయలు, పార్థసారధి, అంబికా లక్ష్మీనారాయణ, దగ్గుమల్ల ప్రసాద్ రావు ఉన్నారు.
నిధులు.. ప్రాజెక్టులపై ప్రత్యకంగా ఫోకస్
వీరితోపాటు టీడీపీ సీనియర్ నేతలు కంభంపాటి రామ్మోహన్ రావు, కనకమేడల రవీంద్ర కుమార్ ఉన్నారు. ఇప్పటికే కేంద్రానికి పంపిన అభివృద్ధి పనుల జాబితాను వీలైనంత త్వరగా క్లియర్ చేయాలని దిశా నిర్ధేశం చేశారు. అలాగే ఏపీ రాజకీయాల గురించి ప్రధానంగా నేతలంతా చర్చించారు.
ALSO READ: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
మంగళవారం పార్లమెంటులో కేంద్రమంత్రులు అమిత్ షా, శివరాజ్సింగ్ చౌహాన్లతో పలువున్ని కలవనున్నారు మంత్రులు లోకేష్, అనిత. ముఖ్యంగా ఇటీవలఏపీని కుదిపేసిన మొంథా తుఫాను ప్రభావం వలన జరిగిన నష్టంపై సమగ్ర నివేదికను కేంద్రమంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్ కు అందించనున్నారు. పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ వచ్చేలా ప్లాన్ చేశారట.