Fridge Storage: కూరగాయలు, పండ్లు, వండుకున్న ఆహార పదార్థాలు తాజాగా ఉండాలంటే ఈ రోజుల్లో అందరికీ గుర్తొచ్చేది ఫ్రిజ్. అయితే చాలామంది మార్కెట్ నుండి తెచ్చిన ప్రతి వస్తువును నేరుగా తీసుకెళ్లి ఫ్రిజ్లో పెట్టేస్తుంటారు. అయితే కొన్ని పదార్థాలను ఫ్రిజ్లో ఉంచడం వల్ల అవి త్వరగా పాడవడమే కాకుండా పక్కన ఉన్న వాటిని కూడా పాడు చేస్తాయి. ఆ పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.
టమోటాలను ఫ్రిజ్లో పెట్టడం వల్ల వాటిలోని సహజసిద్ధమైన రుచి, ఆకృతి దెబ్బతింటాయని నిపుణులు అంటున్నారు. చల్లటి గాలి వల్ల ఇవి లోపల మెత్తగా అయిపోయి, త్వరగా కుళ్ళిపోతాయని పేర్కొంటున్నారు.
ఫ్రిజ్ ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉండటం వల్ల బంగాళాదుంపల్లోని స్టార్చ్ కాస్తా చక్కరగా మారిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు. దీనివల్ల అవి త్వరగా పాడవడమే కాకుండా వండినప్పుడు విచిత్రమైన రుచిని తీసుకొస్తాయని తెలియజేస్తున్నారు.
ఉల్లిపాయాలను ఫ్రిజ్ లో పెడితే.. వాటిలోని తేమ కారణంగా త్వరగా మెత్తబడి, బూజు పట్టే అవకాశం ఉంది. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా లోపల మొలకలు వచ్చి కుళ్ళిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వీటిని ఫ్రిజ్లో పెడితే తొక్క నల్లగా మారిపోయి, లోపల గుజ్జులా అయిపోతాయని నిపుణులు అంటున్నారు. రుచిగా దెబ్బతింటుందని స్పష్టం చేస్తున్నారు. కాబట్టి పైన పేర్కొన్న పదార్థాలను ఎట్టిపరిస్థితుల్లో ఫ్రిజ్ లో పెట్టవద్దని హితవు పలుకుతున్నారు.
చాలామంది పాలు, గుడ్లను ఫ్రిజ్ డోర్ లో ఉండే అరల్లో పెడుతుంటారు. కానీ ఫ్రిజ్ డోర్ తరచూ తీసి మూయడం వల్ల అక్కడ ఉష్ణోగ్రత మారుతూ ఉంటుంది. దీనివల్ల పాలు, గుడ్లు త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంది. అలాగే వండిన ఆహారాన్ని ఎక్కువ రోజులు ఫ్రిజ్లో ఉంచడం వల్ల అందులో బ్యాక్టీరియా చేరి ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read: మద్దతు ఉంటే సరిపోదు.. అది ఓటుగా మారాలి.. క్యాడర్కు కోమటిరెడ్డి క్లాస్!
కొందరు ఆకుకూరలు, కూరగాయలను కడిగిన వెంటనే తడితో ఫ్రిజ్లో పెడుతుంటారు. ఇది కరెక్ట్ కాదని నిపుణులు అంటున్నారు. వాటిని కాసేపు ఆరబెట్టి, కాటన్ బ్యాగుల్లో లేదా జిప్ లాక్ కవర్లలో ఉంచితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయని సూచిస్తున్నారు.
Also Read: ప్రభుత్వ ఉద్యోగినిపై దారుణం.. వెనుక నుంచి వచ్చి.. కొడవలితో 8 సార్లు నరికాడు!