Miyazaki Mango: మామిడి పండు అంటేనే మనకు ముందుగా బంగినపల్లి లేదా కలెక్టర్ రకాలు గుర్తొస్తాయి. వీటి ధర మహా అయితే కిలో వందల్లో ఉంటుంది. కానీ, ఆంధ్రప్రదేశ్లో పండుతున్న ఒక రకం మామిడి పండు ధర వింటే మాత్రం ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే దీని ధర ఏకంగా కిలో రూ. 2.70 లక్షలు!
జపాన్కు చెందిన ఈ అరుదైన రకం పేరు ‘మియాజాకీ’. దీనిని అక్కడ ‘సూర్యుడి గుడ్డు’ (ఎగ్ ఆఫ్ ది సన్) అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఇలాంటి ఖరీదైన పండ్లు విదేశాల్లోనే ఉంటాయని మనం అనుకుంటాం. కానీ, ఇప్పుడు మన విజయవాడలో ఇవి కనువిందు చేస్తున్నాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన ఇంటి ఆవరణలో ఈ చెట్టును ఎంతో ఇష్టంగా పెంచుతున్నారు.
ఈ మామిడి పండు ప్రత్యేకత ఏమిటంటే.. ఇది పండినప్పుడు ఎర్రటి రంగులో మెరిసిపోతూ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీని రుచి, సువాసన ఇతర మామిడి పండ్ల కంటే చాలా భిన్నంగా, ఎంతో మధురంగా ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో దీనికి విపరీతమైన డిమాండ్ ఉండటం వల్లే ధర అంత ఎక్కువగా ఉంటుంది. మన వాతావరణంలో కూడా ఇలాంటి అరుదైన రకాలు పండుతుండటం చూస్తుంటే ఆశ్చర్యంగానూ, సంతోషంగానూ ఉంది కదూ!
Also Read: బీటెక్ పట్టా ఉంది.. కానీ బతుకు భారమైంది.. మంటల్లో మాడిపోయిన యువతి కలలు!
— BIG TV Breaking News (@bigtvtelugu) May 1, 2026