BigTV English
Advertisement

Vizag Politics : రసవత్తరంగా విశాఖ రాజకీయం.. డైలమాలో వైసీపీ ?

Vizag Politics : రసవత్తరంగా విశాఖ రాజకీయం.. డైలమాలో వైసీపీ ?

Vizag MLC and GVMC Elections: విశాఖ రాజకీయం హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక.. మరోవైపు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలతో అక్కడి రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. వైసీపీకి 585 మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఉన్నా.. ఆ పార్టీ నేతలు భయం భయంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. ఇప్పటికే 237 ఓట్లు ఉన్న టీడీపీ.. మరో 200 ఓట్ల కోసం కసరత్తులు చేస్తోంది. టీడీపీతో 200మంది వైసీపీ ఓటర్లు టచ్ లో ఉన్నారని బహిరంగ ప్రకటన చేశారు ఆ పార్టీ నేత గండి బాబ్జి.


Also Read: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి అధికారికంగా అంత్యక్రియలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలంటే.. ప్రతి పార్టీకి 415 ఓట్లు అవసరం. ఓట్ల పరంగా వైసీపీనే ముందంజలో ఉంది. అయితే ఎంపీటీసీ, జడ్పీటీసీలు, కౌన్సిటర్లు, కార్పొరేటర్లు ఎదురు తిరగడంతో వైసీపీ అధిష్టానం డైలమాలో పడిపోయింది. కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పడడంతో అధిష్టానంలో భయం మొదలయింది. ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా అదే రిపీట్ అయితే.. వైసీపీ ఓటమి ఖాయం అవుతుంది. ఈ క్రమంలో 8 నియోజకవర్గాల ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్లతో జగన్ భేటీ అయ్యారు. నిన్న రాత్రి విశాఖ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్లు, కీలకమైన కార్పొరేటర్లు విజయవాడలో జగన్ ను రహస్యంగా కలిశారు. జగన్ వారిని బుజ్జగించినట్లు తెలుస్తోంది. అయితే రెండు పార్టీలు మాత్రం ఎన్నికల్లో గెలుపు మాదంటే.. మాది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి.


Related News

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Jagan Youth Politics: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్

CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబును కలవనున్న శ్రీచరణి

AP Liquor: నకిలీ మద్యం కేసులో 11 మంది నిందితుల రిమాండ్ పొడిగింపు..

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

Big Stories

×