E-Paper
Advertisement

Duvvada Srinivas : రచ్చకెక్కిన ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వివాదం.. అర్థరాత్రి హైడ్రామా.. అసలేం జరిగింది ?

Duvvada Srinivas : రచ్చకెక్కిన ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వివాదం.. అర్థరాత్రి హైడ్రామా.. అసలేం జరిగింది ?

Duvvada Srinivas Family Issue: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన కుటుంబ గొడవలు మరోసారి రచ్చకెక్కాయి. టెక్కలిలోని దువ్వాడ నివాసం దగ్గర అర్థరాత్రి హైడ్రామా నడిచింది. దువ్వాడ ఇంటి ముందు ఆయన కుమార్తెలు నిరసన చేపట్టారు. ఫోన్ చేసినా.. తమ తండ్రి స్పందించడం లేదని వాపోయారు.

తమ తండ్రి వేరే మహిళతో ఉంటూ తమను పట్టించుకోవటం లేదనేది ఆయన కుమార్తెలు హైందవి, నవీన ల ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇంటికి కారులో వచ్చారు. వారు తలుపులు తీయకపోవడంతో ఇంటి బయటే కారులో నిరీక్షించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ.. 5 గంటలసేపు పడిగాపులు పడినా స్పందన లేదు. ఎంత సేపటికీ దువ్వాడ శ్రీనివాస్ తలుపులు తీయకపోవడంతో అర్థరాత్రి తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.

పెద్దకుమార్తె హైందవి మాట్లాడుతూ.. తన భర్త తండ్రి చనిపోయినా.. కనీసం పరామర్శించేందుకు కూడా రాలేదని వాపోయింది. తామెన్నిసార్లు ఫోన్ చేసినా, మెసేజ్ లు పంపినా వేటికీ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గేటు తీసి లోపలికి వెళ్తామన్న భయంతో .. లోపలివైపు తాళాలు వేసేసుకున్నారని వాపోయిందామె.

దువ్వాడ కుటుంబంలో చాన్నాళ్ల నుంచి వివాదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్నా.. అవి ఇప్పుడు బయట పడ్డాయి. శ్రీనివాస్ కు తమ తల్లితో చట్టపరంగా విడాకులు కాలేదని ఆయన కుమార్తెలు చెబుతున్నారు. కాగా.. మరో మహిళతో ఎలా ఉంటారని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు తమ తండ్రి కలిసి ఉంటున్న మహిళకు గతంలోనే పెళ్లై పిల్లలుకూడా ఉన్నారని, తమ తండ్రిని ట్రాప్ చేసి కుట్రలు పన్నుతోందని ఆరోపించారు.

ఆయనతో కలిసి ఉండాలని లేదు..

దువ్వాడ శ్రీనివాస్ మరో స్త్రీ తో కలిసి ఉండటంపై భార్య వాణి స్పందించారు. తామిద్దరిదీ ప్రేమ వివాహమని చెప్పారామె. తన తల్లిదండ్రులు ఒక పాప పుట్టాక కూడా పై చదువులు చదువుకోమని చెప్పినా.. తనకు బంధాలు, విలువలు అడ్డొచ్చాయన్నారు. ఆయనలో కోపం చూశానని, తనను హెరాస్ చేసేవాడని చెప్పుకొచ్చారు. ఆయన రాజకీయాలతో తామెంతో నష్టపోయామని, ఎన్నో కుటుంబాలు అన్యాయమైపోయారని వాపోయారు. దువ్వాడ శ్రీనివాస్ గడప గడపకు వైసీపీ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆమెను చూసిన వారంతా తనకు చెప్పారని, వారంతా అసహ్యించుకునే విధంగా నడుచుకున్నారని తన దృష్టికిి వచ్చిందన్నారు.

ఏదేమైనా దువ్వాడ శ్రీనివాస్ వల్ల తమ కుటుంబం పరువుపోతోందన్నారు. ఆయన నుంచి తమకెలాంటి ఆస్తులు రాలేదని, ఆయన టెక్కలి వదిలి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఆయన నుంచి తనకొక్క రూపాయి కూడా అక్కర్లేదని, పిల్లల బాధ్యత మాత్రం ఆయనే చూసుకోవాలన్నారు.

 

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×