E-Paper
Advertisement

Amaravati News: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరు‌పై ఉత్కంఠ, సాయంత్రం నిర్ణయం?

Amaravati News: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరు‌పై ఉత్కంఠ, సాయంత్రం నిర్ణయం?
Advertisement

Amaravati News: ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి మొదలుకానున్నాయి. ఈసారి వైసీపీ ఎమ్మెల్యేలు.. ముఖ్యంగా మాజీ సీఎం జగన్ సమావేశాలకు హాజరవుతారా? గతంలో మాదిరిగా డుమ్మాకొడతారా? అదే జరిగితే ఎమ్మెల్యేల సాలరీలు ఆగిపోతాయా? ఇవే ప్రశ్న చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలను వెంటాడుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ ఏ విధంగా అడుగులు వేయనున్నారు? అన్నదే అసలు ప్రశ్న.

ఏపీలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి మొదలుకానున్నాయి. శాసనసభ సమావేశాలు ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. శాసనమండలి సమావేశాలు ఉదయం 10 గంటలకు మొదలవుతాయి. సమావేశాలను అయితే 10 రోజులు లేకుంటే రెండు వారాల పాటు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో బిజినెస్ అడ్వైజరీ కమిటీ-BAC సమావేశం జరగనుంది. అందులో సమావేశాలు ఎన్ని రోజులు పెట్టాలనేది నిర్ణయిస్తుంది.

Advertisement

అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎమ్మెల్యేలంతా హాజరు తప్పనిసరి నొక్కి వక్కా నించారు. గైర్హాజరైన వారి జీతాలలో కోత విధిస్తామని ముందుగానే హెచ్చరించారు. స్పీకర్ స్వయంగా సభ్యులంతా హాజరు కావాలని పట్టుబట్టడంతో సభ్యుల హాజరు హాట్ టాపిక్ అయ్యింది. అందరు ఎమ్మెల్యేలు సమావేశాలకు రావాలని తాను కోరుకుంటు న్నానని తెలిపారు.

వారి వారి ప్రాంతాల సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇదొక అవకాశంగా చెప్పారు.  స్పీకర్ స్థానాన్ని గౌరవించడం వైసీపీ ఎమ్మెల్యేల బాధ్యతగా చెప్పారు. ఇదిలా ఉండగా మధ్యాహ్నం మూడు గంటలకు వైసీపీ పార్టీ ఆఫీసులో ఆ పార్టీ శాసనసభా పక్ష సమా వేశం జరగనుంది. జగన్‌తోపాటు 11 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారు.

Advertisement

ALSO READ: ఏం చెప్పారు శ్యామలగారు?

అందులో అసెంబ్లీకి వెళ్లాలా? లేకుంటే బహిష్కరించాలా? అనేదానిపై జగన్ చర్చించనున్నారు. సమావేశాలను బాయ్‌కట్ చేస్తే ఎలాంటి సమస్య ఉండదని, సాలరీ వస్తుందని అంటున్నారు కొందరు ఎమ్మెల్యేలు. ఈ లెక్కన బాయ్‌కట్ అస్త్రాన్ని వైసీపీ ప్రయోగించే అవకాశముందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మండలి సమావేశాలకు ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్టాలకు సవరణలు సహా కీలక ఆర్డినెన్స్‌లను ఈ సమావేశాల్లో ఆమోదించనుంది సభ. నాలా చట్ట సవరణలు, షెడ్యూల్డ్ కులాలు, ఫారెన్ యూనివర్సిటీలకు సంబంధించిన బిల్లులు ఉభయ సభల ముందుకు రానున్నాయి.

 

 

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×