Nandyal: నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు పెద్ద వీరభద్రుడు, వెంకటేశ్వరమ్మ ఇటీవల ఆచరణీయమైన దాతృత్వం ప్రదర్శించారు. పిల్లలు లేని వీరు తమ జీవితకాలం సంపాదించిన ఆస్తిలో దాదాపు రూ.2 కోట్ల విలువ గల ఆస్తిని మాధవరం రాములవారి గుడికి విరాళంగా అందించారు.
వీరు వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగించేవారు. పల్లె జీవితంలో మంచి గుణాలను పాటిస్తూ జీవించారు. తమ ఆస్తిని గుడికి ఇవ్వాలని నిర్ణయించిన విషయం పూర్తిగా స్వచ్ఛందమని వీరు స్పష్టంగా ప్రకటించారు. వారి విరాళం కింద ఆస్తి ఆలయానికి అధికారకంగా చేర్చే విధంగా రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది. వీరు ఆస్తిని వారి ఇష్టానుసార, ఎటువంటి బలవంతం లేకుంగా గుడికి అందించారు.
ఈ విరాళం వలన మాధవరం రాములవారి గుడి అభివృద్ధికి, ఆలయ కార్యకలాపాలకు , భక్తుల కోసం సౌకర్యాల ఏర్పాటుకు ఉపయోగపడనుంది. పెద్ద వీరభద్రుడు, వెంకటేశ్వరమ్మ దంపతులు తమ స్వచ్ఛమైన మనస్సును, భక్తిని ఈ విరాళం ద్యారా చూపించారని గ్రామ ప్రజలు ప్రశంసించారు.
ALSO READ:‘నా క్యారెక్టర్పై నిందలు వేశారు.. సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు’ – భర్త ఇంటి ముందు భార్య పోరాటం!
దేవుడికి రూ. 2కోట్ల ఆస్తి విరాళం ఇచ్చిన వృద్ధ దంపతులు
నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామానికి చెందిన పెద్ద వీరభద్రుడు, వెంకటేశ్వరమ్మ దంపతులు
పిల్లలు లేని ఈ దంపతులు తమ ఆస్తిని మాధవరం రాములవారి గుడికి విరాళమిస్తున్నట్లు ప్రకటన
దాదాపు రూ.2 కోట్ల విలువ గల ఆస్తిని… pic.twitter.com/wJjH2UYzxq
— BIG TV Breaking News (@bigtvtelugu) January 21, 2026