BigTV English
Advertisement

Nara Bhuvaneshwari : టీడీపీ కార్యకర్తలకు నోటీసులు.. వైసీపీ ప్రభుత్వంపై భువనేశ్వరి ఆగ్రహం..

Nara Bhuvaneshwari : టీడీపీ కార్యకర్తలకు నోటీసులు..  వైసీపీ ప్రభుత్వంపై భువనేశ్వరి ఆగ్రహం..

Nara Bhuvaneshwari : వైసీపీ ప్రభుత్వ వైఖరిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి మండిపడ్డారు. రాజమండ్రిలో ఉన్న తనను కలిసి మనోధైర్యాన్ని ఇవ్వడానికి టీడీపీ శ్రేణులు సంఘీభావ యాత్ర చేపడితే నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. తెలుగుదేశం కార్యకర్తలు చేపట్టిన కార్యక్రమంలో తప్పేముంది ప్రశ్నించారు. సంఘీభావం తెలిపేవారికి నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


చంద్రబాబుకు మద్దతుగా సంఘీభావ యాత్ర చేపడితే తప్పేముందని నారా భువనేశ్వరి నిలదీశారు. పార్టీ కార్యకర్తలు తనకు బిడ్డల్లాంటి వాళ్లని పేర్కొన్నారు. బాధలో ఉన్న అమ్మను కలిస్తే చర్యలు తీసుకుంటామని నోటీసులు ఇస్తారా? ప్రశ్నించారు. తనను కలవకూడదని చెప్పడానికి ఈ ప్రభుత్వానికి హక్కు ఎక్కడదని గట్టిగా ప్రశ్నిస్తూ నారా భువనేశ్వరి ట్వీట్‌ చేశారు.

మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్టైన చంద్రబాబు ఇంకా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై భిన్నకథనాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరగనుంది.


ఇంకోవైపు సుప్రీంకోర్టులో స్కిల్‌ డెవలప్ మెంట్ స్కామ్‌ కేసు విచారణ మధ్యాహ్నం రెండు గంటలకు జరగనుంది. ఈ కేసును జస్టిస్ అనిరుద్ధ బోస్ , జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారించనుంది. స్కిల్‌స్కాం కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. మరోవైపు స్కిల్‌స్కాం కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. సుప్రీంకోర్టుల్లో చంద్రబాబు కేసులకు సంబంధించి వాదనలు ఉండటంతో.. ఆయన తరపు సీనియర్‌ న్యాయవాదులు బిజీగా ఉన్నారని కోర్టుకు జూనియర్ లాయర్లు తెలిపారు. దీంతో ఏపీ హైకోర్టు శుక్రవారం దీనిపై విచారణ జరుపుతామని వాయిదా వేసింది.

Related News

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Jagan Youth Politics: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్

Big Stories

×