E-Paper
Advertisement

Nara Bhuvaneshwari : టీడీపీ కార్యకర్తలకు నోటీసులు.. వైసీపీ ప్రభుత్వంపై భువనేశ్వరి ఆగ్రహం..

Nara Bhuvaneshwari : టీడీపీ కార్యకర్తలకు నోటీసులు..  వైసీపీ ప్రభుత్వంపై భువనేశ్వరి ఆగ్రహం..

Nara Bhuvaneshwari : వైసీపీ ప్రభుత్వ వైఖరిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి మండిపడ్డారు. రాజమండ్రిలో ఉన్న తనను కలిసి మనోధైర్యాన్ని ఇవ్వడానికి టీడీపీ శ్రేణులు సంఘీభావ యాత్ర చేపడితే నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. తెలుగుదేశం కార్యకర్తలు చేపట్టిన కార్యక్రమంలో తప్పేముంది ప్రశ్నించారు. సంఘీభావం తెలిపేవారికి నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబుకు మద్దతుగా సంఘీభావ యాత్ర చేపడితే తప్పేముందని నారా భువనేశ్వరి నిలదీశారు. పార్టీ కార్యకర్తలు తనకు బిడ్డల్లాంటి వాళ్లని పేర్కొన్నారు. బాధలో ఉన్న అమ్మను కలిస్తే చర్యలు తీసుకుంటామని నోటీసులు ఇస్తారా? ప్రశ్నించారు. తనను కలవకూడదని చెప్పడానికి ఈ ప్రభుత్వానికి హక్కు ఎక్కడదని గట్టిగా ప్రశ్నిస్తూ నారా భువనేశ్వరి ట్వీట్‌ చేశారు.

మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్టైన చంద్రబాబు ఇంకా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై భిన్నకథనాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరగనుంది.

ఇంకోవైపు సుప్రీంకోర్టులో స్కిల్‌ డెవలప్ మెంట్ స్కామ్‌ కేసు విచారణ మధ్యాహ్నం రెండు గంటలకు జరగనుంది. ఈ కేసును జస్టిస్ అనిరుద్ధ బోస్ , జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారించనుంది. స్కిల్‌స్కాం కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. మరోవైపు స్కిల్‌స్కాం కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. సుప్రీంకోర్టుల్లో చంద్రబాబు కేసులకు సంబంధించి వాదనలు ఉండటంతో.. ఆయన తరపు సీనియర్‌ న్యాయవాదులు బిజీగా ఉన్నారని కోర్టుకు జూనియర్ లాయర్లు తెలిపారు. దీంతో ఏపీ హైకోర్టు శుక్రవారం దీనిపై విచారణ జరుపుతామని వాయిదా వేసింది.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×