BigTV English
Advertisement

Nara Rammurthy Nayudu: రేపు రామ్మూర్తి నాయుడు అంత్య‌క్రియ‌లు.. తమ్ముడిని చూసి చంద్ర‌బాబు భావోద్వేగం

Nara Rammurthy Nayudu: రేపు రామ్మూర్తి నాయుడు అంత్య‌క్రియ‌లు.. తమ్ముడిని చూసి చంద్ర‌బాబు భావోద్వేగం

ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో మృతి చెందారు. కొద్దిరోజులుగా గుండె సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌ హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. ఇప్పటికే చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి, లోకేష్ ఆసుపత్రికి చేరుకోగా తాజాగా సీఎం చంద్రబాబు సైతం ఆస్పత్రికి వచ్చారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు హుటాహుటిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు.


రేపు నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ నేప‌థ్యంలో ఉదయం 5 గంటలకు ప్రత్యేక విమానంలో రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని రేణిగుంట విమానాశ్ర‌యానికి తీసుకువెళ్ల‌నున్నారు. అక్కడి నుండి నారావారిపల్లికి త‌రలిస్తారు. ఇదిలా ఉండగా రామ్మూర్తి నాయుడు గత కొద్ది రోజులుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆసుపత్రిలో చేర్పించగా మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. 1994 నుండి 1999 వరకు రామ్మూర్తి నాయుడు చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు.

ఆయనకు భార్య ఇందిర‌, ఇద్దరు కుమారులు ఉన్నారు. రామ్మూర్తి నాయుడు తిరుపతి ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ సమయంలో నాటకాలపై ఉన్న ఆసక్తితో స్నేహితులతో కలిసి నాటకాలు వేసేవారు. ఆ తర్వాత కాంట్రాక్టర్ గా పనిచేశారు. అనంతరం చంద్రబాబుకు రాజకీయాల్లో అండగా ఉండేవారు. 1992లో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అక‌స్మాత్ముగా ఆయ‌న చ‌నిపోవ‌డంతో కుటుంబంలో విషాదం నెలకొంది.


Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×