BigTV English

New Liquor Policy: ఏపీలో నూతన మద్యం విధానం.. ఎప్పట్నుంచంటే?

New Liquor Policy: ఏపీలో నూతన మద్యం విధానం.. ఎప్పట్నుంచంటే?

AP’s New Liquor Policy: నూతన మద్యం విధానాన్ని రూపొందించడంపై ఏపీ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. కొత్త విధానం రూపకల్పనకు వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. మొత్తం 6 రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం.. ఇందుకోసం అధికారులతో కూడిన నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో ముగ్గురు చొప్పున అధికారులతో కూడిన మొత్తం 4 బృందాలను ఏర్పాటు చేసింది.


రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు ఈ నాలుగు బృందాలు వెళ్లనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న ఎక్సైజ్ పాలసీ విధానం, మద్యం షాపులు, బార్లు, మద్యం కొనుగోళ్లు, ధరలు, నాణ్యత, చెల్లింపుల విధానం, డిజిటల్ పేమెంట్ అంశాలపై ఈ బృందాలు అధ్యయనం చేస్తాయి. అదేవిధంగా ట్రాక్ అండ్ ట్రేస్, డీ అడిక్షన్ సెంటర్ల నిర్వహణ వంటి అంశాలపై కూడా ఈ బృందాలు దృష్టిసారిస్తాయి.

Also Read: శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఏపీలో కూడా మెట్రో రైల్


ఆయా రాష్ట్రాల్లోని అత్యుత్తమ విధానాలపై ప్రభుత్వానికి ఈ బృందాలు ఓ నివేదికను అందజేస్తాయి. ఈ నెల 12 లోగా నివేదకలు సమర్పించాలని ఈ నాలుగు అధ్యయన బృందాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వచ్చే నెల 1 అనగా అక్టోబర్ 1 నుంచి కొత్త ఎక్సైజ్ విధానం అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించడంలో నిమగ్నమయ్యింది.

Tags

Related News

AP Govt Schemes: ఏపీకి స్పెషల్ అవార్డు.. దీని వెనుక అసలు కథ ఇదే!

Chandra Grahanam 2025: సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం.. శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సూచన..!

Turakapalem mystery: ఆ ఊరికేమైంది? 20 మరణాల మిస్టరీ ఏమిటి? రంగంలోకి సీఎం..!

Chandrababu: చంద్రబాబుకి అమరావతికంటే ఇష్టమైన ప్రదేశం ఏంటి?

AP Assembly 2025: 18 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. జగన్ వచ్చేనా?

AP Fact Check: సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు హెలికాప్టర్ హంగామా… వాస్తవం ఏంటో తెలుసా?

Big Stories

×