E-Paper
Advertisement

Cyber Crime: నారా లోకేష్ పేరుతో ఫేక్ ప్రొఫైల్.. రూ.54 లక్షలు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు

Cyber Crime: నారా లోకేష్ పేరుతో ఫేక్ ప్రొఫైల్.. రూ.54 లక్షలు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు
Advertisement

Cyber Crime: సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ.. సైబర్‌ నేరగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా మంత్రి నారా లోకేష్ ఫేక్‌ వాట్సాప్‌ ప్రొఫైల్‌ సృష్టించి.. వ్యాపారవేత్తలను మోసగించారు. దుండగులు ఏకంగా రూ.54 లక్షలు దోచుకున్నారు.

సైబర్‌ నేరగాళ్లు మంత్రి లోకేష్‌ ఫోటో, పేరు, వాట్సాప్‌ డీపీతో నకిలీ ప్రొఫైల్‌ సృష్టించారు. ఆ ప్రొఫైల్‌ ద్వారా పలువురు వ్యాపారవేత్తలకు మెసేజ్‌లు పంపించి.. ప్రత్యేక ప్రాజెక్టుల కోసం డబ్బు అవసరం ఉంది, తక్షణమే పంపించండి అంటూ మంత్రి తరహాలో మెసేజ్‌లు పంపారు. మొదట కేవలం రూ.2–3 లక్షలు మాత్రమే అడిగి, తిరిగి ఇవ్వబోతున్నట్లు నమ్మకం కలిగించారు. ఆ తర్వాత పెద్ద మొత్తాలను ట్రాన్స్‌ఫర్ చేయమని ఒత్తిడి తెచ్చి, చివరికి మొత్తం రూ.54 లక్షలు వసూలు చేశారు.

Advertisement

మోసానికి గురైన ఒక వ్యాపారవేత్త దీనిపై CID సైబర్‌ క్రైమ్‌ విభాగానికి ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు ప్రారంభించారు. ట్రాన్సాక్షన్‌ల వివరాలు, ఫోన్ నంబర్లు, IP అడ్రస్‌లను సేకరించి ట్రాక్‌ చేశారు. విచారణలో నిందితులు హైదరాబాద్‌ నగర పరిధిలోనే ఉన్నట్లు తేలింది.

ఈ నేపథ్యంలో CID అధికారులు మలక్‌పేట్‌ ప్రాంతంలో దాడి చేసి.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారు సాయిశ్రీనాథ్‌, సుమంత్‌ విచారణలో వీరు మోసాన్ని అంగీకరించారు. ఫేక్‌ సిమ్‌ కార్డులు, మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, డబ్బు ట్రాన్స్ఫర్‌కు ఉపయోగించిన పేమెంట్ వివరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

నిందితులను కోర్టులో హాజరుపరచగా.. 14 రోజులు రిమాండ్‌ విధించారు. వీరి వెనుక మరో కీలక నిందితుడు రాజేష్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రాజేష్‌ ఫేక్‌ అకౌంట్లు డబ్బు లావాదేవీలు వంటి కీలక పాత్రలు పోషించాడు. గతంలోనే CID పోలీసులు ఏ1 రాజేష్‌ను అరెస్ట్‌ చేశారు. అతని ఆధారంగా మిగతా నిందితుల గుర్తింపు సులభమైందని అధికారులు తెలిపారు.

Also Read: తిరుమల కల్తీ నెయ్యి కేసు.. తొలి రాజకీయ అరెస్ట్, వైపీసీలో కొత్త టెన్షన్

ఈ ఘటనపై CID అధికారులు హెచ్చరించారు. ప్రముఖులు, మంత్రులు, ఉన్నతాధికారుల పేర్లతో ఎవరైనా మెసేజ్‌లు పంపితే వెంటనే ఫోన్‌ చేసి ధృవీకరించాలి. ఏ సందర్భంలోనూ ఫేక్ అకౌంట్లకు డబ్బులు పంపకూడదు అని సూచించారు. సైబర్‌ నేరాలను అరికట్టేందుకు కొత్త సాంకేతిక పద్ధతులను ఉపయోగిస్తున్నామని, ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

 

Related News

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

Big Stories

Advertisement
×